మొహాలీ: ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టీ20లో భారత్ దారుణంగా ఓడిన విషయం తెలిసిందే. భారత్ విసిరిన 208 రన్స్ టార్గెట్ను ఆస్ట్రేలియా ఈజీగా ఛేజ్ చేసింది. భువనేశ్వర్ 4 ఓవర్లలో 52 రన్స్, హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 49 రన్స్ ఇచ్చారు. ఇక చాహల్ 3.2 ఓవర్లలో 42 రన్స్ సమర్పించుకున్నాడు. అక్షర్ పటేల్ ఒక్కడే 17 రన్స్ ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత ప్రజెంటేషన్ సెర్మనీ సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. సరైన రీతిలో బౌలింగ్ చేయలేకపోయినట్లు చెప్పాడు. డిఫెండ్ చేసుకోవడానికి 200 మంచి స్కోర్ అని, కానీ ఫీల్డింగ్లో విఫలం అయ్యాయని, కొన్ని ఛాన్సులను వదిలేశామని, బ్యాటర్లు బాగానే రాణించారని, కానీ బౌలర్లు మాత్రం ఆశించిన రీతిలో రాణించలేదని రోహిత్ అన్నాడు. ఓటమిపై నిరుత్సాహం వ్యక్తం చేసిన రోహిత్.. మ్యాచ్ను విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉందన్నాడు. గ్రౌండ్ హై స్కోరింగ్కు అనుకూలంగా ఉందని, 200 కొట్టినా రిలాక్స్గా ఉండలేమని, కొంత వరకు వికెట్లు తీసినా.. ఆసీస్ బ్యాటర్లు బాగా ఆడారని, కొన్ని అద్భుతమైన షాట్లు ఆడారని రోహిత్ అన్నాడు.