సంగారెడ్డి: తమ్ముడి సెల్ఫీ సరదా అన్న ప్రాణాలమీదకు తెచ్చింది.. సెల్ఫీ తీసుకునేందుకు ప్రయత్నిస్తూ మంజీర నదిలో పడ్డ తమ్ముడిని కాపాడేందుకు వెళ్లిన అన్న నీటి ప్రవాహంలో కొట్టుకుపోయాడు. అక్కడే ఉన్న అధికారుల అప్రమత్తతతో తమ్ముడు ప్రాణాలతో బయటపడగా.. అన్న కనిపించకుండా పోయాడు.. వివరాల్లోకెళితే.. హైదరాబాద్లోని టోలీచౌకీకి చెందిన మహ్మద్ సైఫ్ (23) సెల్ఫీ దిగుతుండగా మంజీర నదిలో పడిపోయాడు.. అక్కడే ఉన్న అతడి అన్న మహ్మద్ షోహెల్(25) తమ్ముడిని కాపాడేందుకు నీటిలో దూకాడు..సింగూర్ డ్యాం క్రస్ట్ గేట్ వద్ద సైఫ్ను ఇరిగేషన్ సిబ్బంది తాడు సాయంతో పైకిలాగారు..కానీ షోహెల్ మాత్రం మంజీర నదిలో కొట్టుకుపోయాడు.. షోహెల్ను గుర్తించేందుకు అధికారులు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు.. మంజీర నది దిగువ ప్రాంతాల్లో షోహెల్ బాడీ కనిపించిందని రైతులు చెప్పగా.. అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు..