హైదరాబాద్, జనవరి 13 : రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గురువారం రాష్ట్రవ్యాప్తంగా 2,707 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్యధికంగా జీహెచ్ఎంసీ పరిధిలో 1,328, మేడ్చల్ మల్కాజిగిరిలో 248, రంగారెడ్డిలో 202, సంగారెడ్డిలో 78, హనుమకొండలో 75, నిజామాబాద్లో 60, మంచిర్యాలలో 58, ఖమ్మంలో 56 కేసులు నిర్ధారణ అయ్యాయి. యాక్టివ్ కేసుల సంఖ్య 20 వేలు దాటింది. పాజిటివిటీ రేటు 3.2 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 96.51 శాతానికి తగ్గింది.