మూసాపేట, నవంబర్28: మూసాపేట డివిజన్లో ఒకప్పుడు సమస్యలకు నిలయంగా ఉండేది. డ్రైనేజీ,మురుగునీరు పొంగి ఇండ్ల ఎదుట వరదలాగా ప్రవహిస్తున్నప్పుడల్లా కాలనీవాసులంతా దుర్గంధం, దుర్వసనతో ఇబ్బందులు పడేవారు. రోడ్లు సరిగా లేకపోవడంతో వాహనాదారులు, పాదచారులు పడ్డ ఇబ్బందులన్నీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పాడ్డాక తొలగిపోయాయి. సీఎం కేసీఆర్ ప్రభుత్వం బస్తీల అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తూ వాటి రూపురేఖలు మారుస్తుండడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. డివిజన్లో పరిధిలో సుమారు రూ.4కోట్ల నిధులతో అభివృద్ధి పనులు వేగంగా సాగుతున్నాయి. బీఎస్పీ కాలనీలో రూ. 50లక్షలతో సీసీ రోడ్డు పనులు సాగుతుండగా పీఆర్నగర్లో రూ.30లక్షల పార్కు అభివృద్ధి పనులు, రూ.2కోట్ల వ్యయంతో కబీర్నగర్లో రిటర్నింగ్వాల్ పనులు, రాయలసీమ గ్రౌండ్లో రూ. 20లక్షల పార్కు అభివృద్ధి పనుల అనంతరం అవంతినగర్, పీఆర్ నగర్లలో సుమారు రూ.కోటి అంచనా వ్యయంతో సీసీ రోడ్డు పనులకు టెండర్లు పిలవడంతో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
మెరుగైన వసతులకు కృషి
మూసాపేట డివిజన్ పరిధిలోని బస్తీల, కాలనీలలో అంతర్గత రహదారులు, భూగర్భ డ్రైనేజీ అస్తవ్యస్తంగా మారడంతో వాహనదారులు, స్థానిక ప్రజలు అనేక ఇబ్బందులను ఎదుర్కొవలసి వచ్చింది. ఈ నేపథ్యంలో సమస్యలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు దృషికి తీసుకెళ్లాడంతో నిధులు మంజురయ్యాయి. మంజురైన నిధులతో డివిజన్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అభివృద్ధితో డివిజన్ రూపురేఖలు మారుతున్నాయి. దింతో డివిజన్ ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. స్థానికంగా తలెత్తిన సమస్యలను దృషికి తీసుకువచ్చినట్లయితే ఎమ్మెల్యే సహకారంతో తక్షణమే వాటి పరిష్కారానికి కృషి చేస్తాను.
– తూము శ్రావణ్కుమార్, మాజీ కార్పొరేటర్