కాప్రా, జూలై 19: రోడ్లను ఆక్రమించి ఎవరైనా వ్యాపారాలు చేస్తే చర్యలు తప్పవని కాప్రా సర్కిల్ ఏఎంఓహెచ్ డాక్టర్ స్వప్నారెడ్డి అన్నారు. మంగళవారం కాప్రా సర్కిల్ కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ.. వ్యాపారులు ఎవరు కూడా రోడ్లను ఆక్రమించి వ్యాపారాలు చేయవద్దని అన్నారు. రోడ్లు, కాలనీల్లో అపరిశుభ్ర వాతావరణం ఉండకుండా కాలనీవాసులు, ఆయా ప్రాంతాల్లోని దుకాణాదారులు తమవం తు సహకారం అందజేయాలన్నారు. దుకాణాల పరిసరాల వద్ద చెత్తకుప్పలు ఉండవద్దని, ఒకవేళ ఉంటే సదరు దుకాణాదారులకు జరిమానాలు విధించడం జరుగుతుందన్నారు.
మంగళవారం సర్కిల్ పరిధిలోని పలు ప్రాంతాల్లో దుకాణాలు, వాణిజ్య ప్రాంతాలను శానిటరీ అధికారులు, సిబ్బందితో కలిసి పరిశీలించామని అన్నారు. చెత్తకుప్పలు, అపరిశుభ్రవాతావరణం నెలకొని ఉన్న దుకాణాల యజమానులకు జరిమానాలు విధించినట్లు తెలిపారు. ఇందులో భాగంగా ఏఎస్రావు నగర్ ప్రధాన రహదారిపై ఉన్న ఓ ఫ ర్నిచర్ దుకాణం యజమానికి రూ.పదివేల జరిమానా విధించామని తెలిపారు.