మణికొండ, డిసెంబర్ 27: జాతీయ స్థాయి మొదటి ఇండో ఆర్చరీస్ చాంపియన్ షిప్-2021లో నార్సింగి మున్సిపాలిటీ గండిపేటకు చెందిన బల్లి మనీష్ సత్తా చాటాడు. ఈనెల 26న తమిళనాడులో జరిగిన జాతీయస్థాయి మొదటి ఇండో ఆర్చరీస్ చాంపియన్షిప్ పోటీల్లో గండిపేటకు చెందిన మనీష్ బల్లి హోరాహోరీ పోరులో జాతీయస్థాయిలో రెండోస్థానం దక్కించుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మనీష్కు బహుమతితో పాటు సర్టిఫికెట్లను అందజేసి అభినందించారు.
సోమవారం నగరానికి చేరుకున్న మనీష్ బల్లికి గండిపేట మండలానికి చెందిన నాయకులు ముంగిజైపాల్రెడ్డి, గంగిడి ఓంప్రకాశ్రెడ్డితో పాటు స్థానిక నాయకులు మనీష్ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో విజేత తల్లిదండ్రులు, స్నేహితులు పాల్గొన్నారు.