కరీంనగర్: హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓట్ల లెక్కింపు రసవత్తరంగా సాగుతున్నది. ఇప్పటి వరకు ఎనిమిది రౌండ్లు పూర్తయ్యాయి. ఎనిమిదో రౌండ్లో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్కు 162 ఓట్ల మెజార్టీ వచ్చింది. గెల్లు శ్రీనివాస్ యాదవ్కు 4,248 ఓట్లు పోలవ్వగా, బీజేపీకి 4,086 ఓట్లు, కాంగ్రెస్కు 89 ఓట్లు పోలయ్యాయి. ఎనిమిది రౌండ్లు పూర్తయ్యేసరికి ఈటల రాజేందర్ 3,270 ఓట్ల ముందంజలో ఉన్నారు. ఇప్పటివరకూ టీఆర్ఎస్కు 31,837 ఓట్లు రాగా, బీజేపీకి 35,107, కాంగ్రెస్కు 1,175 ఓట్లు వచ్చాయి.