హుజూరాబాద్: ఈటల రాజేందర్ ఆరుసార్లు ఎమ్మెల్యేగా, రెండు సార్లు మంత్రిగా ఉండి చేయలేని పనులు ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉండి ఏమి చేస్తారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. హుజూరాబాద్ పట్టణంలోని టీఆర్ఎస్ పార్టీకార్యాలయంలో రాజ్యసభ సభ్యులు బండ ప్రకాష్, మాజీ మంత్రి ఎల్ రమణ, ఎమ్మెల్యే వివేకానందగౌడ్, ఎమ్మెల్యే బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యే చింత ప్రభాకర్తో కలిసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈటల రాజేందర్కు టీఆర్ఎస్ పార్టీ ఏం తక్కువ చేసింది..? సీఎం కేసీఆర్ టికెట్ ఇచ్చి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించారు. రెండు సార్లు మంత్రిగా అవకాశం ఇచ్చారు. అసలు ఈటలను తెలంగాణ ప్రజానీకానికి పరిచయం చేసింది కేసీఆర్ కాదా..? అని ప్రశ్నించారు. తెలంగాణాలో ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులకు లేని ఆత్మ గౌరవం నీ ఒక్కడికే ఉందా..? అన్నారు.
లెఫ్ట్ భావజాలం ఉన్న రాజేందర్ రైట్ భావజాలం ఉన్న పార్టీ బీజేపీలో చేరడంతోనే నీ ఆత్మ గౌరవం గురించి తెలుస్తుందన్నారు. ఈటల రాజేందర్ హుజూరాబాద్లో ఒక సెకండ్ లీడర్ ను కుడా ఎదగకుండా చేశారు. పచ్చని పొలాలు వచ్చినవి అంటే అది కెసీఆర్ చొరవే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి దాని ద్వారా రైతాంగానికి సాగునీరు అందిస్తుండడంతో ఎక్కడ చూసినా పచ్చని పంటపొలాలు ఉన్నాయి. 6సార్లు ఎమ్మెల్యేగా 2సార్లు మంత్రిగా ఉన్న హుజూరాబాద్కు చేసిందేమిటో చెప్పాలని శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. ప్రజలు నువ్విచ్చే డబ్బులకు, మందుకు, చికెన్ కు అమ్ముడుపోరు…వారు ప్రజలపార్టీ టీఆర్ఎస్ పార్టీనే ఆదరిస్తారు.
బీసీ కులస్తులు రాజకీయంగా, సామాజికంగా గతంలో కంటే ముందుకుపోతున్నారు. బీజేపీ పార్టీ వాళ్ళు డబ్బులతో ప్రజలను కొనాలని చూస్తున్నారు. కానీ ప్రజలు మాత్రం వారిని విశ్వసించరన్నారు. బడుగు, బలహీన వర్గాలకోసం పని చేస్తున్న వ్యక్తి మన ముఖ్యమంత్రి కేసీఆర్. ఆయనకే ప్రజామద్దతు ఉంటుందని ఆయన పేర్కొన్నారు. ఈటలకు సీఎం కేసీఆర్ సీఎం కుర్చీ తప్ప అన్ని పదవులు ఇచ్చారు. మరి ఇంకే పదవి కావాలి నీకు అని ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజేపీ బీసీ జన గణన జరపాలంటే ఎందుకు చేయడం లేదు..? కేంద్రంలో ప్రత్యేక బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటుచేయలేని బీజేపీ బీసీలకు ఏం న్యాయం చేస్తదని అన్నారు.
రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్ మాట్లాడుతూ..దేశంలో ఎక్కడా లేని విధంగా ముదిరాజ్లు ఆర్థికంగా ఎదిగేందుకు రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఉచితంగా చేపపిల్లలు ఇస్తున్నది అని అన్నారు. ముదిరాజ్ల సంక్షేమంపై ప్రత్యేకంగా దృష్టిసారించి 60 వేల ద్విచక్ర వాహనాలు, 70శాతం సబ్సిడీతో ట్రక్కులు అందించామన్నారు.కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని బీసీగణన చేయమంటే ఎందుకు చేయట్లేదని ప్రశ్నించారు. బీసీ గణన చేయని , బీసీలకు న్యాయం చేయలేని బీజేపీకి మనం ఎందుకు ఓటేయాలని ఆయన అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి మద్దతుగా ఉండి కారు గుర్తుకు ఓటేయాలన్నారు. ఈటల రాజేందర్ తన ప్రచారంలో ఒకసారి కుడా అభివృద్ధి చేస్తా అంటలేదు. ఎప్పుడూ టీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్ గారిని తిడుతున్నాడు. టీఆర్ఎస్ పెట్టిన పథకాల వల్ల ఎంతో మందిప్రజలకు లాభం జరిగింది.
బీజేపీలో చేరిన ఈటలను ప్రజలు నమ్మరు. ధరలు పెంచినందుకు ఓటేయమంటావా..? అంటూ బాండ ప్రకాశ్ ఈటలను నిలదీశారు.మాజీమంత్రి ఎల్ రమణ మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెట్రోల్, గ్యాస్, డీజీల్ ధరలను విపరీతంగా పెంచి ప్రజలపై మోయలేని భారం వేసింది. ధరలు పెంచినందుకు బీజేపీకి ఓటేయమంటావా..? అని ఈటలను ప్రశ్నించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న మీపార్టీ వాళ్లతో మాట్లాడి ధరలు తగ్గించవచ్చుకదా.. రాజేందర్ అన్నారు. ఎప్పుడు టీఆర్ఎస్ను విమర్శించడమే తప్ప ఏనాడైనా నవ్వేం చేస్తావో చెప్పావా..? అని ప్రశ్నించారు. కోళ్ల ఫారంలో కోళ్లు అమ్ముకొని ఇంత సంపాదన సంపాదించిన అన్నాడు ఈటల కానీ ఇప్పుడు నియోజకవర్గ ప్రజలకు తెలిసింది ఇది అక్రమ సంపాదన అని రమణ దుయ్యబట్టారు. సాగునీటి రంగంలో కోటి నలభై లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్నది టీఆర్ఎస్ ప్రభుత్వం కాదా..? ప్రజలంతా మోసపూరిత మాటలు నమ్మకుండా కారు గుర్తుపై ఓటువేసి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను గెలిపించాలని ప్రజలను కోరారు.