ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్
అక్కన్నపేట/హుస్నాబాద్టౌన్, డిసెంబర్ 28: గౌరవెల్లి ప్రాజెక్టు భూ నిర్వాసితుల త్యాగం గొప్పదని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ అన్నారు. మంగళవారం ఆయన మండలంలోని గూడాటిపల్లిలోని భూ నిర్వాసితుల శిబిరానికి చేరుకుని ప్రాజెక్టుకు సంబంధించి పలు అంశాలపై చర్చించారు. అంతకు ముందు హుస్నాబాద్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గౌరవెల్లి రిజర్వాయర్లో ముంపునకు గురవుతున్న భూములకు ఇప్పటికే పరిహారం చెల్లించినట్లు తెలిపారు. నిర్వాసితుల సమస్యలపై ఇప్పటికే మంత్రి, కలెక్టర్తోపాటు సంబంధిత అధికారులతో మాట్లాడటం జరిగిందన్నారు. 2007లో ఉన్న ప్యాకేజీ రైతులకు మేలు జరుగదని, సీఎంకేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకుని జీవో తీసుకువచ్చి ఎకరానికి ఆరులక్షలకుపైగా పరిహారం ఇచ్చారని గుర్తుచేశారు.
గ్రామంలోని 937 కుటుంబాలకు రూ.93కోట్ల పరిహారం సైతం ఇవ్వడం జరిగిందని, మిగిలిన వారికి సైతం న్యాయం చేస్తామన్నారు. నియోజకవర్గంలోని బీడుభూములను తడిపేందుకు గోదావరి జలాలు ఉన్నాయని, ఇప్పటికే కాల్వ లు సైతం పూర్తిచేశామన్నారు. పరిహారం విషయంలో నిర్వాసితులు అపోహలు, అనుమానులకు గురికావద్దన్నారు. ప్రతిపక్షాలు నిర్వాసితులను అడ్డంపెట్టుకొని రాజకీయం చేయడం సరికాదన్నారు. ప్రాజెక్టు పనులు ఇప్పటికే 85శాతం పూర్తయ్యాయన్నారు. అయితే నిర్వాసితులు ప్రాజెక్టు తుది దశ నిర్మాణ పనులకు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఆర్డీవో జయచంద్రారెడ్డి, ఎంపీపీ మాలోతు లక్ష్మీబీలునాయక్, జడ్పీటీసీ భూక్యామంగ, మార్కెట్ కమిటీ చైర్మన్ కాసర్ల అశోక్బాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పెసరు సాంబరాజు, మున్సిపల్చైర్పర్సన్ ఆకుల రజితావెంకన్న, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కాసర్ల అశోక్బాబు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు వంగ వెంకట్రామ్రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతిరెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఎండీ. అన్వర్, మున్సిపల్ వైస్చైర్పర్సన్ అనితారెడ్డి, మాజీ ఎంపీపీ వెంకట్, టీఆర్ఎస్ నేతలు రాజయ్య, రమేశ్నాయక్, అఫ్రోజ్, గడ్డం మోహన్ తదితరులు పాల్గొన్నారు.