Warangal | వరంగల్ : జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. కులాంతర వివాహం చేసుకున్నారని ఆగ్రహించిన అమ్మాయి బంధువులు పెండ్లికి సహకరించిన వ్యక్తుల ఇండ్లకు నిప్పు పెట్టారు. ఈ అమానవనవీయ సంఘటన నర్సంపేట మండలంలోని ఇటికాలపల్లి గ్రామంలో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..గ్రామానికి చెందిన ఓ ప్రేమ జంటకు సహకరించారనే కోపంతో అమ్మాయి తరఫు వాళ్లు అబ్బాయి ఇంటితోపాటు పెండ్లికి సహకరించిన అతని ముగ్గురు స్నేహితుల ఇండ్లకు సైతం నిప్పు పెట్టడంతో నాలుగు ఇండ్లు కాలిబూడిదయ్యాయి. సమాచారం అందుకున్న నర్సంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.