న్యూఢిల్లీ, జనవరి 5: కరోనా సోకినా కూడా లక్షణాలు కనిపించని, స్పల్ప లక్షణాలు ఉన్నవారు హోం ఐసొలేషన్లో ఉండటానికి సంబంధించి కేంద్రప్రభుత్వం మార్గదర్శకాలను సవరించింది. పాజిటివ్ వచ్చిన తర్వాత కరోనా రోగులు కనీసం ఏడు రోజుల పాటు ఐసొలేషన్లో ఉండాలని అందులో పేర్కొన్నది. అంతకుముందు ఇది 10 రోజులుగా ఉంది.