Kiren Rijiju | కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు (Kiren Rijiju) అధికారిక నివాసంపైకి ఓ క్యాబ్ దూసుకెళ్లింది. ఈ ఘటనలో మంత్రి నివాసం ప్రహరీ గోడ ధ్వంసమై పెద్ద రంధ్రం ఏర్పడింది. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
హర్యానా రాష్ట్రం నుహ్కు చెందిన రహీమ్ ఖాన్ (Rahim Khan) అనే క్యాబ్ డ్రైవర్ (Cab Driver).. నిన్న సెంట్రల్ ఢిల్లీ (Central Delhi)లోని కృష్ణ మీనన్ మార్గ్ (Krishna Menon Marg)లో గల కేంద్ర మంత్రి కిరణ్ రిజుజు నివాసాన్ని తన కారుతో బలంగా ఢీ కొట్టాడు. దీంతో అప్రమత్తమైన భద్రతా బలగాలు రహీమ్ను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో మంత్రి నివాసం ప్రహరీ గోడ ధ్వంసమైందని, భారీ రంధ్రం పడినట్లు పోలీసులు తెలిపారు. కాగా, తన కారును బస్సు ఢీ కొనడంతో అదుపుతప్పి మంత్రి నివాసం ప్రహరీ గోడను ఢీ కొట్టినట్లు రహీమ్ ఖాన్ తెలిపారు. ఘటన సమయంలో కారులో డ్రైవర్ కుటుంబ సభ్యులు కూడా ఉన్నారు. వారంతా నుహ్కు వెళ్తున్నట్లు రహీమ్ పోలీసులకు వెల్లడించాడు. దీంతో అతన్ని పోలీసులు విడిచిపెట్టారు.
Also Read..
Elon Musk | ఊహించిన దాని కంటే ఎక్కువ సమయమే పట్టింది.. ప్రిగోజిన్ మృతిపై ఎలాన్ మస్క్