హైదరాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ): మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా సీట్లలో స్థానిక రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ దాఖలైన వ్యాజ్యాలపై వివరణ ఇవ్వాలని కాళోజీ వర్సిటీని హైకోర్టు ఆదేశించింది. వికారాబాద్కు చెందిన ఆర్ సౌమ్య దాఖలు చేసిన వ్యాజ్యంపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ ఆరాధే, జస్టిస్ వినోద్ కుమార్తో కూడిన ధర్మాసనం శనివారం విచారించింది.
మేనేజ్మెంట్ కోటా సీట్లలో 10 శాతం రిజర్వేషన్ కల్పించకపోవడం రాజ్యాంగంలోని 371(డీ) అధికరణానికి విరుద్ధమని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీనిపై కౌంటర్ దాఖలు చేయాలని వర్సిటీకి నోటీసులు జారీ చేసిన ధర్మాసనం విచారణను 21కి వాయిదా వేసింది.