Nawab Fakhrul Mulk | హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ): దేశానికి స్వాతంత్య్రం సిద్ధించక పూర్వం నుంచి పెండింగ్లో ఉన్న ఓ భూవివాదానికి 73 ఏండ్ల తర్వాత హైకోర్టు తెరదించింది. ఏడో నిజాం హయాంలో జాగీర్ భూమి రక్షణ కమిటీ ఏర్పాటు, ఆస్తుల పంపిణీపై 1936 నుంచి కొనసాగుతున్న ఈ కేసుకు సుదీర్ఘ వాద, ప్రతివాదనల అనంతరం ఇటీవల ముగింపు పలికింది. నవాబ్ ఫక్రుల్ ముల్ వారసుల మధ్య ఏర్పడిన సివిల్ సూట్ (సీఎస్ 9/1/1951)ను పరిషరిస్తూ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ ఎన్వీ శ్రవణ్ కుమార్ ధర్మాసనం ఈ నెల 23న 101 పేజీల చారిత్రక తీర్పును వెలువరించింది. తొలినాళ్లల్లో కేవలం ఇద్దరు కక్షిదారులు, 26 మంది ప్రతివాదులకు పరిమితమైన ఈ కేసులో కాలక్రమేణా రెండు తరాలవారు మరణించడంతో కక్షిదారుల వారసులు పెద్ద సంఖ్యలో పెరిగారు. ప్రతివాదులు ఏకంగా 94 మందికి చేరారు.
వివరాల్లోకి వెళ్తే.. నవాబ్ ఫక్రుల్ ముల్ 1936లో మృతి చెందడంతో ఆయన జాగీర్ భూముల రక్షణ కోసం ఏడో నిజాం ఓ కమిటీని వేశారు. నిజాం సంస్థానం భారత్లో విలీనమయ్యాక కూడా ఆ కమిటీ కొనసాగించింది. ఎరమ్రంజిల్ ప్యాలెస్, అకడి 21 ఎకరాలు (నాటి విలువ రూ.10.20 లక్షలు), ఎరమ్రంజిల్ వద్ద ఉన్న 75.27 ఎకరాలు (రూ.7.50 లక్షలు), ఎరగ్రడ్డలోని ఎర్రం నుమా బంగ్లా (రూ.3.72 లక్షలు), బొల్లారంలోని బంగ్లా, మరో 14 ఎకరాలు (రూ.1.09 లక్షలు), యూసఫ్గూడ, మూసాపేటలోని భూములు, మరో 3 ఆస్తులు కలిపి మొత్తం తొమ్మిది ఆస్తులను ఐదు భాగాలుగా విభజించి నవాబ్ ఘాజీ జంగ్ బహదూర్, నవాబ్ ఫకర్ జంగ్ బహదూర్, నవాబ్ రాయ్శ్యార్ జంగ్ బహదూర్, నవాబ్ రాయిస్ జంగ్ బహదూర్, నవాబ్ షానవాజ్ జంగ్ బహదూర్కు పంపిణీ చేయాలని గతంలో డిక్రీ వచ్చింది.
ఇది 1951లో హైకోర్టుకు చేరాక వాద, ప్రతివాదుల్లో పలువురు మరణించడంతో వారి వారసులు 73 ఏండ్ల నుంచి న్యాయపోరాటం చేస్తూ వచ్చారు. దీంతో హైకోర్టు రెండేండ్ల క్రితం రిటైర్డు జిల్లా జడ్జి మహమ్మద్ నిజాముద్దీన్ను రిసీవర్ కమ్ కమిషనర్గా నియమించింది. ఆయన నివేదికపై అభ్యంతరాలను స్వీకరించి, విచారణ తర్వాత వాటిని తిరసరించింది. ఈ కేసులో పేర్కొన్న భూములన్నింటినీ ప్రభుత్వం వివిధ అవసరాల కోసం వినియోగంలోకి తెచ్చిందని గుర్తు చేసింది. అమీర్పేటలోని శ్మశాన భూమి మాత్రమే యథాతథంగా ఉన్నదని రిసీవర్ తన నివేదికలో పేర్కొన్నారు. దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం ఆస్తిగా పరిగణించినందున ఆ ఆస్తిని పంచుకునే హక్కు పిటిషనర్లకు లేదని హైకోర్టు స్పష్టం చేసింది. ఓ కమిటీని ఏర్పాటు చేసి ఆ శ్మశాన భూమి పరిరక్షణకు చర్యలు చేపట్టాలని ముల్క్ వారసులకు సూచించింది. ఇతర భూముల విక్రయానికి సంబంధించిన రూ.1,18,81,249 నగదును ముల్క్ వారసులు వడ్డీతో సహా పొందవచ్చని తీర్పు ఇచ్చింది. ప్రస్తుతం హైకోర్టు వద్ద ఉన్న ఆ మొత్తాన్ని జాతీయ బ్యాంకులో డిపాజిట్ చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది.