అమరావతి : ఏపీ ప్రభుత్వం, పోలీసుల వైఖరిపై ఏపీ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. పాదయాత్రకు అనుమతి ఇవ్వలేదని అమరావతి పరిరక్షణ సమితి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. అనుమతిపై సాయంత్రంలోగా ఏ విషయం తేల్చాలని పోలీసులకు కోర్టు ఆదేశించింది. లేకపోతే శుక్రవారం ఉదయమే మొదటి కేసుగా విచారిస్తామని తేల్చి చెప్పింది .
ఆంధ్రప్రదేశ్కు ఏకైక రాజ ధాని అమరావతిని ఉంచాలంటూ అమరావతి ఉద్యమం ప్రారంభమై వెయ్యి రోజులు పూర్తి చేసుకుంటు న్న సందర్భంగా పరిరక్షణ సమితితో పాటు పలు ఉద్యమ సంఘాలు ఈనెల 12 నుంచి మహాపాద యాత్రను తలపెట్టాయి. ఈ య్రా అమరావతి నుంచి అరసవల్లి వరకు నిర్వహించను న్నారు. ఈ పాదయాత్రకు పోలీసు లు అనుమతులు ఇవ్వకపోవడంతో ఉద్యమ నాయకులు నిన్న హైకోర్టును ఆశ్రయించాయి.