హైదరాబాద్: హైదరాబాద్కు చెందిన ప్రముఖ ఫార్మాసూటికల్ కంపెనీ హెటిరో కరోనా డ్రగ్ నిర్మాకామ్ (నిర్మాట్రెల్విర్)కు డబ్ల్యూహెచ్వో ముం దస్తు అనుమతి ఇచ్చినట్టు కంపెనీ సోమవారం వెల్లడించింది. హై రిస్క్ పేషెంట్ల కోసం ఫైజర్ కంపెనీ తయారుచేసిన యాంటివైరల్ డ్రగ్ పాక్స్లావిడ్ అనే జనరిక్ ఔషధానికి మొదటిసారి డబ్ల్యూహెచ్వో అనుమతి ఇచ్చిందని, ఈ ఫార్ములాతో నిర్మాట్రెల్విర్ మాత్రలను తయారుచేస్తున్నట్టు హెటిరో పేర్కొన్నది. ప్రిస్క్రిప్షన్ ఉన్నవారికి మాత్రమే ఈ ట్యాబ్లెట్లను ఇస్తారని, కొవిడ్ నిర్ధారణ అయిన ఐదు రోజుల్లోపు వీటిని వేసుకోవాల్సి ఉంటుందని పేర్కొన్నది.