హైదరాబాద్ : నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు వరద పోటెత్తుతున్నది. గోదావరి ఎగువ ప్రాంతాలతో పాటు పరీవాహక ప్రాంతాల్లో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు డ్యామ్లోకి వరద వచ్చి చేరుతున్నది. ప్రస్తుతం డ్యామ్కు 52,340 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు జలాశయం 16 గేట్లు ఎత్తి 49,920 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 7,500 క్యూసెక్కులు నీరు గోదావరిలోకి వెళ్తోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులకు గాను ప్రస్తుతం నీటిమట్టం 1090.9 అడుగులుగా ఉన్నది. గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా.. ఇప్పుడు 89.76 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.