ఆధునిక కాలంలో ఉద్యోగాలు మెదడుకు తప్ప శరీరానికి శ్రమ ఇచ్చేవిగా ఉండటం లేదు. రోజుకు 10, 12 గంటల పాటు కదలకుండా డెస్క్ ముందు కూర్చుని పని చేసి అలసిపోతున్నారు. ఆఫీసులో దొరికే ఏదో ఆహారాన్ని తిని మమ అంటున్నారు. హెవీ ట్రాఫిక్లో ఎప్పుడో ఇంటికి చేరి తినీ తినక ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నారు. దాదాపుగా ఏ రంగంలో చూసినా పని విధానం ఇలాగే ఉంటున్నది. ఉద్యోగం మానడం కుదరని పని. మరి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? అంటే అందుకూ ఒక మార్గం ఉన్నదని తెలుసుకోండి. సరైన ఆహారం తీసుకోవడం ద్వారా రోజంతా రోబోలా కూర్చుని పని చేయడం వల్ల వచ్చే ప్రతికూల సమస్యలను కూడా తగ్గించుకోవచ్చు.
ఆఫీసులో కూర్చుని ఏం తింటాంలే అని అనుకోనవసరం లేకుండా తేలిగ్గా మోసుకెళ్లే ఆహారాలకు ప్రాధాన్యమివ్వాలి. అవి గుండె ఆరోగ్యంతోపాటు బీపీ కంట్రోల్కు ఏకాగ్రత, జ్ఞాపకశక్తిని పెంచేందుకు ఉపయోగపడాలి. అలాంటి ఓ ఐదింటి గురించి తెల్సుకుందాం.
బాదం పప్పు, బఠాణీ, పిస్తా, మరే ఇతర నట్స్ కన్నా కూడా అక్రూట్లలో ఎక్కువ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. డ్రైఫ్రూట్స్ అన్నీ గుండెకు సంబంధించే వ్యాధులను తగ్గించే లిపిడ్స్ను మెరుగుపరుస్తాయి. అయితే, అక్రూట్లు అంతకు మించి సాయపడతాయని కొన్ని పరిశోధనల్లో తేలింది. రోజుకు ఏడు అక్రూట్ పప్పులు తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు.
గ్రీన్ టీలో అధిక శాతం ఉండే పాలిఫెనాల్స్ ధ్వంసమైన డీఎన్ఏను మరమ్మతు చేస్తుంది. అంతేకాకుండా రోగ నిరోధక వ్యవస్థను కూడా ఉత్తేజితం చేస్తాయి. గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కొన్ని రకాల కాన్సర్లను రాకుండా నిరోధించుకోవచ్చు. అయితే, ఎక్కువ మొత్తంలో కాకుండా నిత్యం నాలుగు కప్పుల గ్రీన్ టీకి మించకుండా చూసుకోవడం ఉత్తమం.
ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇది. అందుబాటులో ఉండే ఆరోగ్యకరమైన స్నాక్స్లో పాప్కార్న్ ఒకటి. ఇందులో ఫైబర్తో పాటు యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధిక శాతంలో ఉంటాయి. అయితే పాప్కార్న్లో ఉప్పు తగ్గించుకొని వేసుకుంటే వీటిని మించిన ఆహారం లేదని నిపుణులు చెప్తున్నారు. మైక్రోవేవ్ ఆఫీస్లో అందుబాటులో ఉంటే తక్కువ ఉప్పుతో రెండు నిమిషాల్లో పాప్కార్న్ తయారు చేసుకోవచ్చు.
డార్క్ చాక్లెట్లో పాలిఫెనాల్స్ వంటి బలమైన యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి గుండె వ్యాధులను నిరోధించడమే కాకుండా రక్తం గడ్డకట్టకుండా నిరోధిస్తుంది. నిత్యం ఒక చిన్న సైజ్ డార్క్ చాక్లెట్ బార్ తింటే రక్తపోటు తగ్గుతుంది. డార్క్ చాక్లెట్లో ఉండే కెఫైన్ మానసికంగాఉత్తేజితం చేయడమే కాకుండా ఏకాగ్రత పెరిగేందుకు కూడా సహాయపడుతుంది.
ఆకలి వేస్తున్న భావనను జయించాలంటే ఉత్తమ మార్గం పండ్లను తినడం. వీటిలోలో ఉండే పౌష్టికత మనం నీరసపడకుండా రోజంతా పని చేసేందుకు శక్తినిస్తాయి. ఆపిల్స్, అరటి, మామిడి, బొప్పాయ వంటి పండ్లను ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది.
టీ20 వరల్డ్ కప్కు ఐసీసీ మార్గదర్శకాలు
తాలిబాన్లకు పాక్ జనరల్స్ మద్దతు : మాజీ ఎంపీ ఆరోపణ
ఆఫ్ఘాన్ నుంచి పౌరుల తరలింపు మొదలెట్టిన అమెరికా
ఇంగ్లండ్లో తుపాకీ కాల్పులు.. ఆరుగురు మృతి
నువ్వెప్పుడు రాష్ట్రపతి అవుతావు మోదీ తాతా..?!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..