హైద్రాబాద్,మే 27: పిల్లల ఫుడ్ విషయంలో తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచే శ్రద్ధ తీసుకోవాలి. కానీ చిన్న పిల్లలు తినడానికి మారం చేస్తారు. అలా చేస్తున్నారని వారిని అలానే వదిలేస్తే ఏమి తినరు. అలా కాకుండా కొంచెం శ్రద్ధ తీసుకుని వాళ్లకు తినిపించడం వల్ల ఆరోగ్యంతో పాటు అలవాట్లు కూడా మారుతాయి.
పిల్లలు ఈ మధ్య ఫోన్లు, టీవీలకు ఎడిక్ట్ అయిపోయి తిండి మీద ద్యాస తగ్గిపోతుంది. మరికొంతమంది అయితే అతిగా తింటూ అనారోగ్యం తెచ్చుకుంటున్నారు. పిల్లలకు జంక్ ఫుడ్ అలవాటు చేయకూడదు. పిల్లలు ఇంట్లో తల్లిదండ్రులు ఏది చేస్తే అదే నేర్చుకుంటారు. అందుకే ముందు మనలో మార్పు రావాలి. మీరు వాళ్ళ ముందు మంచి ఆహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఉండాలి.
వాటిని చుసిన పిల్లలు కూడా అవే చేస్తూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి మంచి అలవాట్లు అలవాటు అవుతాయి. పిల్లలకు ఇంట్లో మనం పనిచేసేటప్పుడు హెల్ప్ చేయమని అడగాలి. అలా చేస్తే వాళ్లకు చిన్నప్పటి నుండే హెల్పింగ్ నేచర్ అలవాటు అవుతుంది. పిల్లలకు బయట దొరికే ఫుడ్ అస్సలు పెట్టకూడదు. అంతేకాదు హోమ్ వర్క్ చేస్తే చాకోలెట్ ఇస్తా అనే మాటలు కూడా వాళ్లకు చెప్పకూడదు.
పిల్లలకు ఎక్కువుగా కూరగాయలు, పండ్లు, ఆకుకూరలు, తృణ ధాన్యాలు, పాలు పాల పదార్ధాలు వంటివి ఎక్కువగా పెట్టాలి. అంతేకాదు మరీ వాళ్లతో కఠినంగా కూడా ఉండకూడదు. అప్పుడప్పుడు బయట ఫుడ్ పాప్ కార్న్ కానీ.. ఐస్ క్రీం కానీ కొనిపెడితే వాళ్ళు కూడా ఆనందంగా ఫీల్ అవుతారు. ఇలాంటివి పాటిస్తే పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు. ఇది వారి ఫ్యూచర్ కు కూడా చాలా మంచిది.