చిన్నపిల్లల బ్రెయిన్ షార్ప్ అవ్వాలని తల్లిదండ్రులు వివిధ రకాల ప్రొడక్ట్స్ వాడుతుంటారు. వాళ్ల మెదడు పనితీరు ఇతర పిల్లల కంటే మెరుగ్గా ఉండాలని కోరుకుంటారు. అలాగే, చాలామందికి కరోనా, ఇతర కారణాలవల్ల ఈ మధ్యకాలంలో మతిమరుపు పెరిగిపోయింది. మరి అన్ని వయస్సులవారికీ మెదడు ఉత్తేజితం అవ్వాలంటే ఒకటే మార్గమని తన అనుభవపూర్వకంగా చెబుతున్నారు ప్రముఖ విద్యావేత్త వాసిరెడ్డి అమర్నాథ్. బ్రేక్ఫాస్ట్లో వేటిని తీసుకుంటే పిల్లల్లో మెదడు చురుగ్గా మారుతుంది? పెద్దల్లో మతిమరుపు సమస్యకు చెక్ పడుతుంది? అనే విషయాలను క్షుణ్నంగా వివరించారు. మరి అవేంటో చూసేద్దామా..