హాలియా: ఉపాధ్యాయులే సమాజ మార్గ నిర్ధేశకులని, రాష్ట్రంలో ఉన్న, అమలవుతున్న గురుకుల విద్యావిధానం యావ త్ భారతదేశానికే ఆదర్శమని నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల భగత్ అన్నారు. ఆదివారం హాలియా పెన్షనర్స్ భవనం లో యాదవ సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కట్టెబోయిన సైదులు యాదవ్ సన్మాన కార్యక్ర మానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తీసుకున్న జీతానికి న్యాయం చేయాలనే తపనతో పేద విద్యార్థుల శ్రేయస్సు. పాఠశాల అభివృద్ధి కోసం సైదులు సార్ ఎంతగానో కృషి చేశాడని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రతి ఉపాధ్యాయుడు కృషి చేయాలని కోరారు.
కరోనా సమయంలో కరెంట్ లేక, నెట్ సిగ్నల్ అందక విద్యార్థులు ఆన్లైన్ తరగతులకు దూరం అవుతున్నారనే ఉద్దేశ్యంతో సైదులు గారు గ్రామ వీధుల్లో, చౌరస్తాలో, పిల్లలు ఆడుకునే ఆట ప్రదేశంలో పాఠశాల విద్యార్థులకు సం బంధించిన గణితం, తెలుగు, ఇంగ్లిష్ సబ్జెక్టుల వారీగా చార్టులు తయారు చేసి ఆట పాటల్లో పిల్లలకు విజ్ఞానాన్ని అందించడం అభినందనీయమన్నారు.
శిల్గాపురంలో ప్రతి పిల్లవాడిని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విధంగా ఉపాధ్యాయులు చోరవ తీసుకోవడం శుభ పరిణామం అన్నారు. సైదులు సార్ ను ఆదర్శంగా తీసుకొని పాఠశాల అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానన్నారు. అనంతరం కట్టెబోయిన సైదులును శాలువాతో ఘనంగా సన్మానించారు.
యాదవ ఉద్యో గుల సంఘ ఆధ్వర్యంలో జరిగిన లొడంగి గోవర్థన్, మండలి రవి, సండ్రాల వెంకన్న, జవ్వాజి వెంకటే శ్వర్లు, చింతల వెంకటేశ్వర్లు, కురాకుల వెంకటేశ్వర్లు, మల్గిరెడ్డి లింగారెడ్డి, రావుల రాంబాబు, గౌని సుధారాణి, శీలం మల్లయ్య, గౌని రజారమేశ్, కట్టెబోయిన అనిల్, పిల్ల అభినయ్, పంట లక్ష్మణ్, నడ్డి బాలరాజు, బూడిద గోవింద్, పిల్లి వెంకట్ తదితరులున్నారు.