హైదరాబాద్, జనవరి 27: గ్రూప్-1 మెయిన్స్ అర్హత పరీక్షను ఇంగ్లిష్తో పాటు తెలుగు భాషలోనూ నిర్వహించాలని పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు గురువారం పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ను హైదరాబాద్లో కలిసి వినతిపత్రం అందజేశారు. దీనివల్ల గ్రామీణ ప్రాంత విద్యార్థులకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు.