నిజాంపేట, మే9: ప్రస్తుతం కొద్ది దూరం నడవాలంటేనే ఆయాస పడుతుంటాం, కొందరు వాహనాలు లేనిదే బయటకు వెళ్లరు. కానీ, ఈ బామ్మను చూస్తే అందరూ ముక్కున వేలేసుకోవాల్సిందే. 40 ఏండ్లుగా సైకిల్ తొక్కుతూ ఏ మాత్రం అలసట లేకుండా సునాయాసంగా ప్రయాణం చేస్తున్నది.
నిజాంపేట మండలం తిప్పనగుల్ల గ్రామానికి చెందిన ఈ బామ్మ పేరు జంగం కేతమ్మ వయస్సు 66 సంవత్సరాలు. సోమవారం బామ్మ తిప్పనగుల్ల నుంచి నందిగామ వైపు ఇలా సైకిల్ తొక్కుతూ, ట్రింగ్ ట్రింగ్ అని బెల్ కొడుతూ చిరునవ్వులు చిందిస్తూ కనిపించింది. సైకిల్ ప్రయాణం ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నది ఈ బామ్మ.