పాలమూరు/మరికల్/ధన్వాడ/దేవరకద్ర/దేవరకద్ర రూరల్/ దామరగిద్ద/ నారాయణపేట టౌన్/ మక్తల్/ జడ్చర్ల, ఏప్రిల్ 23 : మహబూబ్నగర్లో హనుమాన్ జయంతి సందర్భంగా బజరంగ్దళ్ ఆధ్వర్యంలో మంగళవారం శోభాయాత్ర నిర్వహించారు. కార్యక్రమానికి మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి, బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. మరికల్ లో వీహెచ్పీ, బజరంగ్దళ్ ఆధ్వర్యంలో శోభాయాత్ర నిర్వహించారు. ధన్వాడ మండల కేంద్రంలో ని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవరకద్రలోని ప్రసన్నాంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి హనుమాన్ శోభాయాత్ర నిర్వహించారు. అదేవిధంగా కౌకుంట్ల, చిన్నచింతకుంట మండలాల్లోనూ హనుమాన్ జయంతిని నిర్వహించారు. దామరగిద్దలోని సంజీవరాయ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. విఠలాపూర్లో బండలాగుడు పోటీలు, రెట్టపట్ల పోటీలు చేపట్టారు. నారాయణపేట పట్టణంలోని బారంబావి నుంచి గొడుగుగేరి హనుమాన్ మందిరం వరకు హనుమాన్ విగ్రహంతో శోభాయాత్ర ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పర్ణికారెడ్డి త దితరులు పాల్గొన్నారు. అనంతరం డోలారోహణం నిర్వహించారు. మక్తల్, జడ్చర్ల, నవాబ్పేట్ తదితర పట్టణాల్లో హనుమాన్ శోభాయాత్రను నిర్వహిం చగా వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.