అమరావతి : వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాన్ని ఎదుర్కొనలేకపోతే భవిష్యత్ అంధకారమవుతుందని జనసేన అధ్యక్షుడు పవన్కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. మన్యం జిల్లా పాలకొండలో నిర్వహించిన వారాహి విజయయాత్ర సభలో ఆయన మాట్లాడారు. జగన్ (Jagan) అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని వర్గాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు.
కూటమి (Allaince) కి ఓటు వేయాలని అడగడం లేదని కూటమి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్తిస్తున్నానని, రాబోయేది కూటమి ప్రభుత్వమేనని అన్నారు. పంచాయతీలకు కేంద్ర నిధులు (Central Funds) అందించే బాధ్యత తీసుకుంటామని అన్నారు. సీపీఎస్ సమస్యకు ఏడాదిలోపు పరిష్కారం చూపుతామని తెలిపారు.
ఉద్యోగులకు ఒకటో తేదీన జీతాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధికి తనవంతుగా రూ. కోటీ విరాళం ఇస్తానని పవన్ కల్యాణ్ ప్రకటించారు. పాలకొండ నియోజకవర్గాన్ని బంగారు కొండగా మార్చే బాధ్యత తీసుకుంటానని వెల్లడించారు.