లక్నో: పాము కాటు వల్ల ఒక యువకుడు మరణించాడు. అయితే ఏదైనా అద్భుతం జరుగుతుందని కుటుంబ సభ్యులు భావించారు. విషం విరుగుతుందన్న మూఢనమ్మకంతో తాళ్లతో కట్టిన మృతదేహాన్ని గంగా నదిలో ఉంచారు. (Body Hung In Ganga River) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఉత్తరప్రదేశ్లోని బులంద్షహర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జైరాంపూర్ కుడేనా గ్రామానికి చెందిన 20 ఏళ్ల మోహిత్ కుమార్ బీకామ్ చివరి ఏడాది చదువుతున్నాడు. ఈ నెల 4న తుది పరీక్షలు రాయాల్సి ఉంది.
కాగా, ఏప్రిల్ 26న పార్క్కు వెళ్లిన మోహిత్ కుమార్ను పాము కాటు వేసింది. వాంతి కావడంతో ఇంటికి చేరుకున్న అతడు కుటుంబ సభ్యులకు ఈ విషయం చెప్పాడు. ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. అయినప్పటికీ కుటుంబ సభ్యులు ఆశ వదులుకోలేదు. పాము విషం విరుగుడు చేసేవారి వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లగా అతడు చనిపోయినట్లు వారు చెప్పారు.
మరోవైపు గంగా నదిలో మృతదేహాన్ని ఉంచితే విషం తొలగి మోహిత్ బతుకవచ్చని కుటుంబ సభ్యులు భావించారు. ఈ మూఢనమ్మకంతో తాళ్లతో కట్టిన మృతదేహాన్ని గంగా నదిలో ఉంచారు. ఇది చూసేందుకు స్థానికులు గుమిగూడారు. అయితే ఎలాంటి ఫలితం లేకపోవడంతో చివరకు మోహిత్ మృతదేహానికి గంగా ఘాట్లో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
20 वर्षीय मोहित कुमार को सांप ने काट लिया। अंधविश्वास में फैमिली वालों ने उसको 2 दिन तक गंगा में लटकाए रखा। उन्हें ऐसा बताया गया था कि गंगा के बहते जल में शरीर को रखने से जहर उतर जाता है। लेकिन मोहित जिंदा नहीं हुआ। जिसके बाद उसका अंतिम संस्कार किया गया।
📍बुलंदशहर, उत्तर प्रदेश pic.twitter.com/JDY5XupSl1— Sachin Gupta (@SachinGuptaUP) May 2, 2024