హైదరాబాద్ : ఇంటర్మీడియట్ కళాశాలలు తెరిస్తే కఠిన చర్యలు తప్పవని ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ హెచ్చరించారు. ప్రభుత్వం తదుపరి ఉత్తర్వులిచ్చే వరకు కళాశాలను మూసివేయాలని ఆదేశించారు.
విద్యార్థులకు ఆన్లైన్ బోధన కొనసాగించాలని సూచించారు. కళాశాలల యాజమాన్యాలు నిబంధనలు పాటించేలా జిల్లా ఇంటర్ విద్యా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు.
రాష్ట్రంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మెడికల్ కళాశాలలు మినహా అన్ని కళాశాలలు, పాఠశాలలను మూసివేయాలని ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి..