కేతేపల్లి, సెప్టెంబర్ 29 : తెలంగాణ ప్రభుత్వం ఆడబిడ్డలకు బతుకమ్మ పండుగ కానుకగా చీరెలను పంపిణీ చేస్తుందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. మండలంలోని భీమారంలో గురువారం మహిళలకు బతుకమ్మ చీరెలు ఆయన పంపిణీ చేసి మాట్లాడారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో మహిళలకు అన్ని విధాలుగా సంక్షేమ పథకాలు అందు తున్నాయన్నారు. దేశ విదేశాల్లో కూడా మన ఆడబిడ్డలు బతుకమ్మ సంబరాలు చేసుకోవడం ఇందుకు నిదర్శనమన్నారు. కార్యక్రమంలో ఇన్చార్జి ఎంపీడీఓ భవాని, సర్పంచ్ బడుగుల శ్రీనివాస్యాదవ్, నాయకులు చిముట వెంకన్నయాదవ్, జి.నాగరాజు, సయ్యద్ ఫరీద్, జి.వెంకటయ్య, పి.విష్ణు, వీరయ్య, సతీశ్ పాల్గొన్నారు.
మహిళల అభ్యున్నతే సర్కారు ధ్యేయం : జడ్పీచైర్మన్ నరేందర్రెడ్డి
నార్కట్పల్లి: మహిళల అభ్యున్నతే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయమని జడ్పీ చైర్మన్ బండ నరేందర్రెడ్డి అన్నారు. మండలంలోని గోపలాయపల్లి, ఎం.యెడవల్లి, నెమ్మాని, ఏపీ లింగోటం, చెర్వుగట్టు గ్రామాల్లో మహిళలకు బతుకమ్మ చీరెలు, ఆసరా పింఛన్ మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మాట్లాడుతూ మహిళలు సం స్కృతీ, సంప్రదాయాలను చాటి చెప్పేలా బతుకమ్మ వేడుకలు నిర్వహించుకోవాలన్నారు. ఎంపీ పీ సూదిరెడ్డి నరేందర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ రేగట్టె మల్లికార్జున్రెడ్డి, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్రెడ్డి, ఎంపీడీఓ యాదగిరి, సర్పంచులు గంట్ల నర్సిరెడ్డి, గోసుల భద్రాచలం, సామ నరేందర్రెడ్డి, మల్గ బాలకృష్ణ, చిట్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కొండూరు శంకర్ పాల్గొన్నారు.
ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసమే బతుకమ్మ చీరెలు : ఎమ్మెల్యే భూపాల్రెడ్డి
తిప్పర్తి : ఆడబిడ్డల ఆత్మ గౌరవం కోసమే ప్రభుత్వం బతుకమ్మ చీరెలు పంపిణీ చేస్తుందని ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి అన్నారు. తిప్పర్తి మండలం మర్రిగూడ, ఇండ్లూరు, వెంకటాద్రిపాలెం, పజ్జూరు, ఎర్రగడ్డలగూడెం, కంకణాలపల్లి, దుప్పలపల్లి,రామలింగాలగూడెం,తిప్పర్తి గ్రామాల్లో బతుకమ్మ చీరెలు, పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుదన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, జడ్పీటీసీ పాశం రాంరెడ్డి, వైస్ ఎంపీపీ ఏనుగు వెంకట్రెడ్డి, తాసీల్దార్ క్రిష్ణయ్య, ఎంపీడీఓ మహేందర్రెడ్డి, సర్పంచులు రొట్టెల రమేశ్, మోయిజ్, మార్త శ్రీదేవి, కోన జానయ్య, ఎంపీటీసీ, డీసీసీబీ డైరెక్టర్ పాశం సంపత్రెడ్డి, రైతు బంధు సమితి కో ఆర్డినేటర్ ముత్తినేని శ్యాంసుందర్ పాల్గొన్నారు.
శాలిగౌరారం: మండలంలోని అడ్లూర్ గ్రామంలో బతుకమ్మ చీరెలను సర్పంచ్ బోడ నర్సయ్య, టీఆర్ఎస్ మాజీ మండలాధ్యక్షుడు కట్టా వెంకట్రెడ్డి చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ నల్లగొండ వినోద, దొనకొండ ఆంజనేయులు పాల్గొన్నారు. మాదారం గ్రామంలో సర్పంచ్ జెర్రిపోతుల మంజులా చంద్రమౌళి లబ్ధిదారులకు పింఛన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ నోముల జనార్దన్, కార్యదర్శి శివకుమార్, తోటకూరి వంశీ, నోముల శ్రీనివాస్, సత్యనారాయణ పాల్గొన్నారు.
నాంపల్లి : మండలంలో మల్లపురాజుపల్లి, మహ్మదాపురం, రేక్యతండా, బండతిమ్మాపురం గ్రామాల్లో చీరెలను ఎంపీపీ ఏడుదొడ్ల శ్వేత, జడ్పీటీసీ ఎలుగోటి వెంకటేశ్వర్రెడ్డి పంపిణీ చేశారు. కార్యక్రమంలో సర్పంచులు మునగాల సుధాకర్రెడ్డి, రేవెల్లి సుధాకర్, సురేందర్నాయక్ మహిళలు పాల్గొన్నారు.
మునుగోడు : మండలంలోని రావిగూడెం, జక్కలవారిగూడెం, గంగోరిగూడెం, రత్తుపల్లి, సింగారం, ఊకొండి గ్రామాల్లో ఎంపీపీ కర్నాటి స్వామి మహిళలకు బతుకమ్మ చీరెలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆయా సర్పంచులు, టీఆర్ఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు.