నల్లగొండ : సీఎం కేసీఆర్ పాలనలో గ్రామాలకు మహర్దశ వచ్చిందని, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుందని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మంగళవారం కేతపల్లి మండలం కొత్త పేట గ్రామంలో రూ.20 లక్షలతో సీసీ రోడ్ల పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా రూ.17 లక్షలతో మౌలిక వసతుల కల్పనకు శంకుస్థాపన చేశారు.
కాసనగొడు గ్రామంలో రూ.2౦ లక్షలతో చేపట్టిన సీసీ రోడ్డును, రూ. 12.60 లక్షలతో నిర్మించిన వైకుంఠ ధామాన్ని ఎమ్మెల్యే చిరుమర్తి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తున్నారన్నారు. పల్లె ప్రగతి వంటి పథకాలతో గ్రామాల రూపురేఖలే మారిపోయాయని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో స్థానకి ప్రజా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.