న్యూఢిల్లీ, సెప్టెంబర్ 12: ముగిసిన 2022-23 ఆర్థిక సంవత్సరానికి రూ.2,908.99 కోట్ల తుది డివిడెండ్ను షేర్హోల్డర్లకు చెల్లించినట్టు ప్రభుత్వ రంగ విద్యుదుత్పాక సంస్థ ఎన్టీపీసీ తెలిపింది. ఈ డివిడెండ్ తమ చెల్లింపు ఈక్విటీ మూలధనంలో 30 శాతమని కంపెనీ మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో తెలిపింది. గత ఆర్థిక సంవత్సరంలో తుది డివిడెండ్తో కలుపుకుని మొత్తం రూ. 7,030.08 కోట్లు..పన్ను అనంతర లాభంలో 41 శాతం డివిడెండ్ చెల్లించినట్టు కంపెనీ వివరించింది.