Google Doodle | దేశంలో సార్వత్రిక ఎన్నికలకు (Lok Sabha Elections) పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం ఏడు దశల్లో జరుగుతున్న ఈ పోలింగ్ తొలి విడత ఇప్పటికే ముగిసింది. నేడు రెండో విడత (Second Phase) పోలింగ్ జరుగుతోంది. ఉదయం 7 గంటలకే పోలింగ్ కూడా ప్రారంభమైంది. ఈ సందర్భంగా ప్రముఖ సెర్చింజన్ గూగుల్ ప్రత్యేక డూడుల్ (Google Doodle) రూపొందించింది.
సందర్భానుసారంగా గూగుల్ కొత్త డూడుల్తో అందిరినీ ఆశ్చర్యపరుస్తుంటుందన్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే రెండో విడత పోలింగ్ సందర్భంగా కూడా ప్రత్యేక డూడుల్తో ఓటర్లకు అవగాహన కల్పించే ప్రయత్నం చేసింది. ఐకానిక్ లోగో ‘Google’ మధ్యలో ఉండే ‘o’ని ఇంక్ మార్క్తో ఉన్న చూపుడు వేలితో కూడిన చేతి గుర్తుతో నింపింది. ఇక ఈ ప్రత్యేక డూడుల్పై క్లిక్ చేస్తే ఎన్నికలకు సంబంధించిన వివరాలు వచ్చేలా గూగుల్ దీన్ని రూపొందించింది. ప్రస్తుతం ఈ ఎన్నికల డూడుల్ అందరినీ ఆకట్టుకుంటోంది.
లోక్సభ ఎన్నికల (Lok Sabha Elections) రెండో విడత పోలింగ్ శుక్రవారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఈ దశలో 13 రాష్ర్టాల్లోని 89 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 1,206 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. మొత్తం 15.88 కోట్ల మంది తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 8.08 కోట్ల మంది పురుషులు, 7.8 కోట్ల మహిళలు ఉన్నారు. వీరికోసం 1.67 లక్షల పోలింగ్ కేంద్రాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది.
Also Read..
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల రెండో దశ పోలింగ్ షురూ.. బరిలో రాహుల్, హేమమాలిని
Richest Candidate: రెండో విడత లోక్సభ పోల్స్.. సంపన్నుల జాబితాలో కాంగ్రెస్ లీడర్ టాప్
Supreme Court | స్త్రీ ధనంపై భర్తకు హక్కు ఉండదు.. వాడుకున్నా తిరిగి ఇవ్వాల్సిందే: సుప్రీంకోర్టు