న్యూఢిల్లీ, సెప్టెంబర్ 29: బంగారం ధర మరింత తగ్గింది. అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాల ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయంగా క్రమంగా దిగొస్తున్నది. ఢిల్లీలో తులం బంగారం ధర రూ.250 తగ్గి రూ.58,700కి దిగొచ్చింది. గడిచిన రెండు రోజుల్లోనూ ఇంచుమించుగా వెయ్యి రూపాయల వరకు తగ్గింది.
అలాగే వెండి ఏకంగా రూ.1,200 తగ్గి రూ.74,300కి దిగింది. దీంతో బంగారం ధరలు ఏడు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోయాయని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీ వర్గాలు వెల్లడించాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఔన్స్ గోల్డ్ ధర 1,871 డాలర్లకు, వెండి 23.05 డాలర్లకు పడిపోయాయి.