న్యూఢిల్లీ : రికార్డు ధరలకు ఎగబాకిన బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో శుక్రవారం హాట్ మెటల్స్ ధరలు వరుసగా నాలుగో రోజు తగ్గుముఖం పట్టాయి.
ఎంసీఎక్స్లో పదిగ్రాముల బంగారం రూ 77 తగ్గి రూ 49,220 వద్ద ట్రేడవుతుండగా కిలో వెండి సైతం రూ 77 తగ్గి రూ 56,295 వద్ద ట్రేడవుతున్నాయి. డాలర్తో రూపాయి మారకం విలువ, అంతర్జాతీయ డిమాండ్తో పాటు భౌగోళిక, రాజకీయ అంశాల ఆధారంగా భారత్లో బంగారం, వెండి ధరలు ఒడిదుడుకులకు లోనవుతుంటాయి.