హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్ట్పై వివక్ష చూపినట్టుగానే గురుకులాలను కూడా సీఎం రేవంత్రెడ్డి పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్ ఆరోపించారు. తెలంగాణ భవన్లో ఆయన మాట్లా డు తూ.. సీఎం వద్దే విద్యా, ఎస్సీ సంక్షే మ శాఖలు ఉన్నాయని, నాసిరకం భోజనం తో విద్యార్థుల ప్రాణాలు పోతున్నా, సమీ క్షించడం లేదని మండిపడ్డారు. నల్లగొం డ జిల్లాలో భవ్యా యాదవ్, వైష్ణవి ఆత్మహత్య చేసుకున్నారని, తాజాగా ప్రశాంత్ ఫుడ్ పాయిజన్తో మృతి చెందాడని పేర్కొన్నారు. భోజన నాణ్యతపై ఫుడ్ ఇన్స్పెక్టర్లతో తనిఖీలు చేయించాలని కోరా రు. గురుకులాల బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్రెడ్డి ప్రాపకం కోసమే కోమటిరెడ్డి బ్రద ర్స్ ప్రయత్నిస్తున్నారని, లోక్సభ ఎన్నికల తర్వాత వెంకట్రెడ్డి మంత్రి పదవి పోవడం ఖాయమని ఎద్దేవా చేశారు.
ప్రశాంత్ది ప్రభుత్వ హత్యే
భువనగిరిలో జిల్లా సాంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థి ప్రశాంత్ మృతి ముమ్మాటికీ కాంగ్రెస్ ప్రభుత్వ హత్యే. సీఎం రేవంత్ రెడ్డికి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ, పాలనపై లేదు. బాధిత కుటుంబానికి రూ.10లక్షల ఎక్స్గ్రేషియా, ఒకరికి ప్రభుత్వోద్యోగం ఇవ్వాలి.
-కే.వాసుదేవ రెడ్డి, బీఆర్ఎస్ అధికార ప్రతినిధి
రూ.25 లక్షలు ఇవ్వాలి
రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యార్థి ప్రశాంత్ మృతి చెందాడు. ఇలాంటి ఘటనలు జరుగుతున్నా సీఎం స్పందించడం లేదు. కాంగ్రెస్ పార్టీకి రాజకీయాలపై ఉన్న శ్రద్ధ విద్యార్థుల బాగోగులు ఆలోచించడం లేదు. బాధిత కుటుంబానికి వెంటనే రూ.25 లక్షలు అందజేయాలి. లేదంటే బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు చేపడుతాం.
-తుంగ బాలు , బీఆర్ఎస్వీ నాయకుడు