ఎల్బీనగర్, జూలై 23 : తెలంగాణ వ్యాప్తంగా శుక్రవారం నిర్వహించే తెలంగాణ బంద్ను విజయవంతం చేయడంతో పాటుగా చలో గాంధీ భవన్కు పిలుపునిస్తున్నామని తెలంగాణ నిరుద్యోగుల జేఏసీ అధ్యక్షుడు ఇంద్రానాయక్ అన్నారు. గురువారం రాత్రి దిల్సుఖ్నగర్లో నిరుద్యోగ జేఏసీ నాయకులతో కలిసి తెలంగాణ బంద్ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భం గా ఇంద్రానాయక్ మాట్లాడుతూ.. తెలంగాణలో నిరుద్యోగుల సమస్యలు, ఉద్యోగాల భర్తీపై ప్రభుత్వం స్పం దించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ నిరుద్యోగుల పక్షాన శుక్రవారం తెలంగాణ వ్యాప్త బంద్కు పిలుపునిచ్చామని, ఈ కోవలోనే మా డిమాండ్లను వినిపించేందుకు చలో గాంధీ భవన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.
ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ యువతకు న్యా యం, ఖాళీ పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయ డం వంటి అంశాలపై ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నామన్నారు. మా ఉద్యమం, మా నిరసన శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్దంగా కొనసాగుతుందని, రాష్ట్ర ప్రజలు, విద్యార్థులు, నిరుద్యోగ యువత, ప్రజా సంఘాలు మా న్యాయమైన డిమాండ్లకు మద్దతు తెలిపి.. మా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగ జేఏసీ నాయకులు ఆకాశ్, నవీన్, శంకర్, శిం బు, కుమార్, సోమేశ్, గణేశ్, వినయ్, రాజు యాదవ్ పాల్గొన్నారు.