ఈటల రాజేందర్ అంతులేని అధికారం కావాలని కోరుకున్నారని, ఏకంగా ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకే ద్రోహం చేయాలని కుట్రలు చేశారని హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్యాదవ్ అన్నారు. కుట్రల్లో భాగంగా హైదరాబాద్లోని తన ఇంట్లో ప్రతిపక్ష పార్టీల నేతలతో, సంఘాల ముఖ్యులతో ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టారని చెప్పారు. భూములు, ఆస్తుల కోసం నియోజకవర్గ అభివృద్ధిని పక్కనబెట్టారని విమర్శించారు. పేద దళితుల పొట్ట కొట్టేలా
దళితబంధు పథకాన్ని కూడా ఆపించారని మండిపడ్డారు. రాష్ట్రంలో మరో రెండున్నరేండ్లు టీఆర్ఎస్ అధికారంలో ఉంటుందని, అభివృద్ధి జరగాలంటే కారు గుర్తుకే ఓటు వేయాలని ఓటర్లను కోరారు. తెలంగాణకు సీఎం కేసీఆర్ నాయకత్వమే శ్రీరామరక్ష అన్న గెల్లు.. హుజూరాబాద్ ప్రజలు రాజేందర్కు ఆరుసార్లు అవకాశం ఇచ్చారని, ఈసారి తనకు ఒక అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తిచేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పోలింగ్ నేపథ్యంలో ఆయన ‘నమస్తే తెలంగాణ’తో ప్రత్యేకంగా ముచ్చటించారు. – హుజూరాబాద్, నమస్తే తెలంగాణ ప్రతినిధి
ఆరుసార్లు ఎమ్మెల్యే, రెండుసార్లు మంత్రి, ఒకసారి టీఆర్ఎస్ఎల్పీ నేతగా అనుభవమున్న ఈటలకు.. రాజకీయంగా అనుభవం లేని మీకు పోటీ అనుకుంటున్నారు!
ప్రజాస్వామ్యంలో ప్రజలే గొప్పవాళ్లు. ఇక్కడ సీనియార్టీ కంటే పార్టీల విధానాలు, ప్రజల మద్దతే కీలకం. టీఆర్ఎస్లో ఉండటం వల్లే ఈటలకు అన్ని పదవులు వచ్చినయి. హుజూరాబాద్ మొదటి నుంచి చైతన్యం ఉన్న గడ్డ. అందుకే కాంగ్రెస్, టీడీపీ కోటలను బద్దలు కొట్టి టీఆర్ఎస్ గెలిచింది. ఉద్యమంలో ముందుండి నడిచింది. బంగారు తెలంగాణ నిర్మాణంలో సీఎం కేసీఆర్కు అండగా ఉంటున్నది. మొదట ఉద్యమ పంథాతో, రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలతోనే టీఆర్ఎస్ అభ్యర్థిగా ఈటల గెలిచాడు. ఇప్పుడు గెల్లు శ్రీనివాస్ ఒక్కడు కాదు. అభివృద్ధి, సంక్షేమ పాలన అందించే టీఆర్ఎస్ అభ్యర్థిగా ప్రజల ముందుకొచ్చాడు. అభివృద్ధి నిరంతర ప్రక్రియ. అది టీఆర్ఎస్తోనే సాధ్యం. హుజూరాబాద్ ప్రజలు ఎప్పుడూ మంచివైపే నిలుస్తారు.
ఈటలకు వందల కోట్ల ఆస్తులు, వందల ఎకరాల భూములున్నా నియోజకవర్గంలో అభివృద్ధి చేయాలంటే ప్రభుత్వ నిధులే రావాలి. వీణవంక, కమలాపూర్ లేదా మరో ఊరిలో.. ఒక రోడ్డు వేయాలంటే ప్రభుత్వమే నిధులివ్వాలి. ఎన్ని వందల కోట్లున్నా ఈటల సొంత పైసలతో పనిచేయడు కదా? అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడాదికి రూ.5కోట్ల నిధులు వస్తాయి. వాటితోనే అభివృద్ధి ఎలా సాధ్యం? టీఆర్ఎస్ను గెలిపిస్తే సీఎం కేసీఆర్ను ఒప్పించి హుజూరాబాద్కు అదనంగా రూ.100 కోట్ల నిధులు తీసుకొస్తా.
ఈటల స్వతహాగా పేదల వ్యతిరేకి. అభివృద్ధి అంటే గిట్టదు. ప్రజలు ఎప్పుడూ అమాయకులుగానే ఉండాలని అనుకుంటారు. ప్రభుత్వపరంగా అమలైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు తప్పితే, రెండుసార్లు మంత్రిగా ఉన్నా ఇక్కడ ఏమీచేయలేదు. వైద్యారోగ్య మంత్రిగా కనీసం ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయించాలనే ఆలోచన రాలేదు. టీఆర్ఎస్ను గెలిపిస్తే సీఎం కేసీఆర్ను ఒప్పించి హుజూరాబాద్లో మెడికల్ కాలేజీ ఏర్పాటుకు కృషిచేస్తా.
ఇది పచ్చి అబద్ధం. మంత్రిగా ఉన్న ఈటలపై భూ కబ్జా ఆరోపణలు వచ్చాయి. బెదిరింపులతో అసైన్డ్ భూములు తక్కువధరకు కొన్నారని పేదలు ఎమ్మార్వో ఆఫీసులో ఫిర్యాదు చేశారు. మంత్రిపై ఫిర్యాదు కాబట్టి చర్యల విషయంలో ఆలస్యం కావటంతో కొందరు నేరుగా ప్రగతిభవన్కు వచ్చి గోడు చెప్పుకొన్నారు. దీనిపై విచారణ చేస్తుండగానే ఆ భూముల్ని రూ.6 లక్షలకు ఎకరం చొప్పున కొన్నట్టు ఈటల స్వయంగా ప్రెస్మీట్ పెట్టి చెప్పిండు. హైదరాబాద్ శివారులో రూ.80 లక్షలకు ఎకరం ఉండే భూమిని అంత తక్కువ ధరకు ఎలా కొంటారు? క్షేత్రస్థాయిలో ఆరా తీస్తే ఈటల మనుషులు అక్కడికి వెళ్లి ఎకరానికి రూ.2, 3 లక్షలే ఇచ్చారని బాధితులు చెప్పారు. దీనిపై విచారణ కోసం ఈటలను మంత్రి పదవి నుంచి పక్కనబెట్టారు. ఆరోపణలపై స్పష్టత వచ్చేవరకు ఆగకుండా ఈటల ఎమ్మెల్యే పదవికి, పార్టీకి రాజీనామా చేసి వెళ్లిపోయారు. ఈటలకు ఆస్తులు, పదవులే ముఖ్యమా? పేదలకు ప్రభుత్వం ఇచ్చిన భూములను బలవంతంగా గుంజుకోవడం కరెక్టేనా? వీణవంక ప్రాంతంలోనే ఎకరం 15 లక్షలకు తక్కువ లేదు. హైదరాబాద్ దగ్గర రూ.2, 3 లక్షలకు ఎకరం భూమిని ఎవరైనాఇస్తారా?.. అది అధికార దుర్వినియోగమే కదా.
ఈటలను సొంత తమ్ముడిలా చూసుకున్నానని ఎన్నోసార్లు స్వయంగా కేసీఆరే చెప్పారు. ఆయన మాత్రం ఆస్తుల సంపాదనపైనే దృష్టిపెట్టారు. ఈటల ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే దేవరయాంజాల్లోని సీతారామచంద్రస్వామి భూములను కబ్జా చేసి, పట్టా చేసుకొనేందుకు ప్రయత్నించారు. ఆ భూముల క్రమద్ధీకరణ కోసం అప్పటి సీఎంల వద్దకు వెళ్లానని ఈటలే స్వయం గా ప్రెస్మీట్లో చెప్పిండు. తెలంగాణ వచ్చాక రాష్ర్టాన్ని అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ఈటలకు కేసీఆర్ కీలక ఆర్థికశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. ఈటల మాత్రం ఆలయ భూములను తన పేరిట పట్టా చేయాలని సీఎంనుఅడిగిండు. అక్రమాలు, తప్పుడు పనులు ఎక్కువగా జరిగే కాంగ్రెస్ హయాంలోనే ఆ భూములను పట్టా చేయలేదు. యాగాలు, యజ్ఞాలు చేసే కేసీఆర్.. దేవుడి భూములను ఒక వ్యక్తికి ఎలా దక్కనిస్తారు? కేసీఆర్ ఒప్పుకోలేదని ఈటల మనసులో పెట్టుకున్నాడు. అప్పటి నుంచే దూరమయ్యాడు.
తెలంగాణలో విచిత్ర రాజకీయాలున్నాయి. వ్యక్తిగత ప్రయోజనాల కోసం జాతీయ పార్టీల నేతలు కుమ్మక్కు అవుతుంటారు. ఉపఎన్నికలోనూ అదే జరిగింది. జాతీయ స్థాయిలో ప్రత్యర్థులు బీజేపీ, కాంగ్రెస్ ఇక్కడ కలిసి పని చేస్తున్నాయి. వాటికి టీఆర్ఎస్సే లక్ష్యం. పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి హుజూరాబాద్కు వచ్చి ఈటలకు మద్దతుగా ప్రకటన చేసిండు. చివరి వరకు అభ్యర్థిని ప్రకటించకుండా.. నామినేషన్ల చివరి రోజు ఎవరికీ తెలియని వ్యక్తిని తెచ్చి పెట్టిండు. కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బీజేపీ అభ్యర్థి కోసం పనిచేస్తున్నది.
తెలంగాణ ఆత్మగౌరవం టీఆర్ఎస్. రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశానికి దిక్సూచిగా ఉంటున్నాయి. దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇన్ని పథకాలు లేవు. మన ఎన్నో పథకాలను కేంద్రంతోపాటు చాలా రాష్ర్టాలు కాపీ కొట్టినయి. ఇప్పుడు ప్రవేశపెట్టిన దళితబంధు పథకం సొమ్ములను పేదలకు అందకుండా బీజేపీ కుట్ర చేసి ఆపించింది. దళితబంధు నిరంతర ప్రక్రియ. కేసీఆర్ మాటంటే వెనక్కి తగ్గరు. కోడ్ ముగియగానే యథావిధిగా అమలవుతుంది.
ముమ్మాటికీ నిజం. ఈటలకు ఆస్తులు, భూములే ముఖ్యం. అధికార వాంఛతో సీఎం కేసీఆర్కు ద్రోహం చేయాలని కుట్రలు చేసిండు. హైదరాబాద్లోని తన ఇంట్లో ప్రతిపక్ష నేతలతో ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టిండు. కొన్ని రోజుల క్రితం టీఆర్ఎస్లో సీఎం కేసీఆర్ తర్వాత ఆ పదవిని కేటీఆర్ చేపట్టాలని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేశారు. విచిత్రంగా ఇప్పుడు పీసీసీ చీఫ్గా ఉన్న వ్యక్తితోపాటు బీజేపీ కీలక ప్రజాప్రతినిధులు కొందరు ఈటలకు ఆ అవకాశం ఇవ్వాలన్నారు.
టీఆర్ఎస్ ఆవిర్భావంలోనే ప్రత్యేకత ఉంది. ఇది తెలంగాణ కోసం ఏర్పడిన ఉద్యమ పార్టీ. ఉద్యమ సమయంలోనూ ఎందరో సామాన్యు లు ఎంపీలు, ఎమ్మెల్యేలు అయ్యారు. ఇప్పుడు నాకూ అలాగే అవకాశం వచ్చింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నామినేషన్ ఖర్చులిచ్చి బీఫాం ఇస్తారు. నాలాంటి పేదవాడికి అవకాశం రావ టం అనేది టీఆర్ఎస్తోనే సాధ్యం. హుజూరాబాద్లో ఈటల నియంతగా పాలించిండు. సర్పంచ్ ఎన్నికలు వస్తే పార్టీ అభ్యర్థి ఎవరో చెప్పకుండా ఒక్కో ఊరిలో ఐదుగురిని ఎగేసిండు. అట్లా పోటీ చేసిన అందరూ ఖర్చులపాలై ఆగమైండ్రు. పార్టీలో ఉన్నవారికి పదవులు రాకుండా ఐదేండ్లసారి ఇతర పార్టీల వాళ్లను తెచ్చి పదవులు ఇచ్చిండు. మొదటి నుంచి టీఆర్ఎస్లో ఉన్న వాళ్లను దూరం పెట్టిండు. ఇప్పుడు హుజూరాబాద్లో టీఆర్ఎస్కు మంచి రోజులు వచ్చినయి.