హుజూరాబాద్ : హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కంటతడి పెట్టారు. హుజూరాబాద్ మండలం పెద్దపాపయ్యపల్లిలోని భాషబోయిన ప్రవీణ్ యాదవ్ ఇంటికి వెళ్లిన ఆయన, భావోద్వేగానికి లోనయ్యారు. ప్రవీణ్ యాదవ్ తల్లి విజయ, భార్య రమ్యను శ్రీనివాస్ ఓదార్చారు.
అక్కడే ప్రెస్ మీట్ పెట్టి ఈటెల రాజేందర్ తీరుపై ధ్వజమెత్తారు. ప్రవీణ్ యాదవ్ను పొట్టనబెట్టుకున్నది ఈటెల రాజేందరేనని ఆరోపించారు. అందుకే ఆ కుటుంబాన్ని ఇప్పటివరకు ఓదార్చలేదన్నారు. ప్రెస్మీట్ ముగించే వరకు తన దుఃఖాన్ని అదుపుచేసుకుని కన్నీటిని ఆపుకున్న గెల్లు, ఆ తర్వాత భావోద్వేగానికి గురై కంటతడి పెట్టారు.