హైదరాబాద్, ఏప్రిల్ 1 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర గిరిజన సహకార సంస్థ చైర్మన్గా నియమితులైన రమావత్ వాల్యానాయక్ శుక్రవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్, ఆర్ అండ్ బీ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డిని హైదరాబాద్ మంత్రుల నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమకాలం నుంచి క్రమశిక్షణతో పనిచేస్తున్న కార్యకర్తలకు టీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ తప్పకుండా అవకాశాలు కల్పిస్తారని అన్నారు. ఇందుకు వాల్యానాయక్ నియామకమే ఉదాహరణ అని పేర్కొన్నారు. జీసీసీ ద్వారా గిరిజనులకు లబ్ధిచేకూర్చడంలో తమ సహకారం ఎప్పుడూ ఉంటుందని మంత్రులు తెలిపారు.