శంషాబాద్ రూరల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కర్ణాటక రాష్ట్రం బెంగుళూరుకు గంజాయి ( Ganja) ని తరలిస్తున్న ముఠాను మాదాపూర్ ఎస్వోటీ , చౌదర్గూడ పోలీసులు ( Police ) లాల్పహాడ్ వద్ద ఆదివారం పట్టుకున్నారు. వీరివద్ద నుంచి రూ.62 లక్షల విలువ గల పొడి గంజాయితో పాటు 178 కిలోల గంజాయిని, రెండుకార్లను స్వాధీనం చేసుకున్నట్లు శంషాబాద్ జోన్ డీసీపీ నారాయణరెడ్డి మీడియాకు వెల్లడించారు.
ఏపీ (AP )లోని చిత్తూరు జిల్లా మోతుగూడెం నుంచి బెంగుళూరు (Bangalore) కు గంజాయిని తరలిస్తున్నారన్న పక్కా సమాచారంతో షాద్నగర్ నియోజకవర్గంలోని లాల్పహాడ్ వద్ద వాహనాలను తనిఖీలు చేపట్టారని వివరించారు. మొదటగా వచ్చిన వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా మరో వాహానంలో వెనుకాల వస్తున్న స్కోడా కారులో గంజాయి వస్తున్నట్లు సదరు వ్యక్తులు వివరించారు.
దీంతో పోలీసులు కారును ఆపి తనిఖీ చేయగా అందులో తరలిస్తున్న 178 కిలోల గంజాయిని, రెండు కార్లు, నాలుగు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్లో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు డ్రైవర్లు బిధ్యధర్ కీర్తానియా, ప్రశాంత్ బిస్వాస్, ఒరిస్సాకు చెందిన సిప్రాకాజీ( మహిళ) ఉన్నారు. ఈ కేసులో మొత్తం ఎనిమిది మందిపై కేసు నమోదు చేశామని డీసీపీ (DCP) వెల్లడించారు.