హైదరాబాద్ : గణేశ్ నిమజ్జనం సందర్భంగా ఆదివారం నుంచి రెండు రోజుల పాటు అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లు నడుపనున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. నాగోల్ – హైటెక్సిటీ, ఎల్బీనగర్ – మియాపూర్, పరేడ్ గ్రౌండ్ – ఎంజీ బస్స్టేషన్ కారిడార్లలో సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. ఈ నెల 20 వరకు అర్ధరాత్రి ఒంటిగంట వరకు మూడు కారిడార్లలోని అన్ని చివరిస్టేషన్ల నుంచి మెట్రో రైళ్లు బయలుదేరి.. అర్ధరాత్రి 2 గంటల వరకు చివరి స్టేషన్కు చేరుకోనున్నట్లు వివరించారు.
ఇప్పటికే జంటనగరాల పరిధిలో ప్రత్యేక రైళ్లను నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ నెల 20న తెల్లవారు జాము 4 గంటల వరకు ప్రత్యేక సర్వీసులు కొనసాగనున్నాయి. అలాగే గ్రేటర్ పరిధిలో జరిగే గణేశ్ నిమజ్జనం వేడుకలకు ఆర్టీసీ జోన్ పరిధిలో 656 ప్రత్యేక సర్వీసులు నడిపిస్తున్నది. దాదాపు 31 డిపోల నుంచి ప్రత్యేకంగా భక్తుల సౌకర్యార్థం బస్సులు నడిపిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.