భారతీయుల పండుగల్లో ఆధ్యాత్మికతతోపాటు సమిష్టితత్వం, ఉత్సాహం నింపే వాటిలో వినాయక చవితి వేడుకలు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఈ పండుగ రాకతో పల్లెలు, పట్టణాల్లోనూ కోలాహలం నెలకొంటున్నది. తొమ్మిది రోజులపాటు ఘనంగా నిర్వహించేందుకు యువజన, భక్త బృందాలు వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించి పూజించనున్నారు. ఉత్సాహభరిత వాతావరణంలో జరుపుకొనే పండుగల్లో వినాయక చవితిదే మొదటి స్థానం. ప్రతి ఏడాది భాద్రపదమాసం శుక్ల చతుర్థి రోజు హస్త నక్షత్రం రోజున చవితి ఉత్సవాలు ప్రారంభమవుతాయి.
నెట్వర్క్ మహబూబ్నగర్, ఆగస్టు 30 : విఘ్నాలను తొలగించే లంబోదరుడి పూజకు వేళైంది. గణాధిపతి అయిన గణేశుడు వాడవాడలా కొలువుదీరనున్నాడు. బుధవారం మండపాల్లో ప్రతిష్ఠితుడై పూజలు అందుకోనున్నాడు. పండుగను ఘనంగా నిర్వహించేందుకు ఉమ్మడి జిల్లాలో సర్వం సిద్ధం చేశారు. ఊరూవాడా పండుగ కోలాహలం మొదలైంది. మండపాలను అందంగా ముస్తాబు చేశారు. ఇప్పటికే కొందరు విగ్రహాలను తరలించగా.. మరికొందరు తీసుకెళ్లే పనుల్లో నిమగ్నమయ్యారు. ఇక సమస్తం వినాయకుడి మంత్రమే వినిపించనున్నది. మండప నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు.
నాగర్కర్నూల్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ)/బాలానగర్/అచ్చంపేట రూరల్/వనపర్తి టౌన్/గద్వాల టౌన్/ఖిల్లాఘణపురం : ముక్కోటి దేవతలచే తొలి పూజలందుకునే లంబోదరుడు.. గడపగడపకు వరాలిచ్చే గణనాథుడు.. ఆపదలో ఆదుకునే ఆదిదేవుడు.. విద్యకు నాయకుడు.. గరిక పూజలకే సంబురపడే మంచి దేవుడు.. దివి నుంచి భువికి దిగి వచ్చేశాడు.. బుధవారం వినాయక చవితిని పురస్కరించుకొని వాడవాడలా కొలువు దీరేందుకు సిద్ధమయ్యాడు.. భక్తుల కోరికలు తీర్చి అన్ని విధాలా రక్షణగా ఉండే గణనాథుడికి విశిష్ట పూజలు చేసేందుకు ప్రజలు సంసిద్ధులయ్యారు.. వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా జరుపుకొనేందుకు అన్ని ఏర్పాట్లు చేపట్టారు..
వాడవాడలా తొమ్మిది రోజులపాటు సందడి కనిపించనున్నది. వీధి, వాడ, గ్రామం, పట్టణా లు ఇలా అన్నింటా లంబోధరుడు కొలువుదీరనున్నాడు. మండపాలు విద్యుత్ వెలుగులతో దే దీప్యమానంగా వెలిగిపోతూ కొత్త శోభను సంతరించుకోనున్నాయి. కానీ, ఈ సంబురాల వెనుక ప్రకృతి పర్యావరణానికి జరుగుతున్న నష్టాన్ని మాత్రం ఎవరూ గుర్తించడం లేదు. రసాయన పదార్థాలతో తయారుచేసిన విగ్రహాలను ప్రతిష్ఠించడంతో పర్యావరణాన్ని చేజేతులా నాశనం చేసుకుంటున్నామన్న విషయాన్ని మరుస్తున్నారు. ప్రమాదకరమైన రంగులు, పీవోపీతో చేసిన విగ్రహాలను వాడొద్దని చెప్పేవారు సైతం ఈ విగ్రహాలను ప్రతిష్ఠిస్తున్నారు. కేవలం పండుగ రోజు మాత్రమే మట్టి విగ్రహాలను వాడండి అని చెప్తున్నారే తప్పా ముందు చూపు కనబర్చడం లేదు. దీంతో గత్యంతరం లేక రసాయనాలతో తయారుచేసిన విగ్రహాలనే కొనుగోలు చేస్తున్నారు. స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వ అధికారులు రసాయనాల వల్ల తలెత్తే ప్రమాదాలు, సమస్యలను ఎప్పటికప్పుడు వివరిస్తున్నారు. కానీ, ప్రత్యామ్నాయ మార్గాలు లేకపోవడంతో పీవోపీ విగ్రహాల వైపే మొగ్గుచూపుతున్నారు.
కొల్లాపూర్ రూరల్ : మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్న ముస్లిం కౌన్సిలర్లు రహీంపాషా, నయీం
పెరిగిన ధరలు..
లంబోధరుడు వివిధ రూపాల్లో కొలువుదీరనున్నాడు. షోలాపూర్, కర్ణాటక, హైదరాబాద్ త దితర ప్రాంతాల నుంచి తెచ్చిన విగ్రహాలను ఔ త్సాహికులు ముందుగానే కొనుగోళ్లు చేస్తున్నా రు. విగ్రహం సైజు, కళా నైపుణ్యాన్ని బట్టి ధరల ను నిర్ణయించారు. రూ.1000 నుంచి రూ.20 వేల వరకు విగ్రహాలు లభిస్తున్నాయి. ఒక్క అ డుగు కంటే ఎక్కువ ఎత్తులో ఉన్న మట్టి విగ్రహా లు రూ.10వేలకు పైగా ధరలు పలుకుతున్నా యి. పండ్లు, పూలు, ఆకులు, వెలక్కాయ తదితర పూజా సామగ్రి ధరలు చుక్కలనంటాయి. ఒక్కో ఎల్లక్కాయ రూ.10 నుంచి రూ.30 వరకు విక్రయిస్తుండగా.. డజను అరటిపండ్లు రూ.80 దాటింది. చివరికి పంట పొలాల్లో దొరికే గరక, ఉత్తరేణి, గురుగుపూలు, చేరకు తదితర ప్రకృతిపరమైనవి కూడా మార్కెట్లో అమ్మకానికి పెట్టారు. అన్నీ కలిపి తయారు చేసిన ఒక కట్టను రూ.50 నుంచి రూ.100 వరకు విక్రయిస్తున్నారు. పూల ధరలు కూడా ఆకాశాన్నంటాయి.
పూజలో వాడే పత్రాలు..
తులసి, రేగు, బిల్వం, రాగి, జమ్మి, నేల ము నగ, జిల్లేడు, మర్వం, దానిమ్మ, విరజాజి ఆకు, గన్నేరు, ఉమ్మెత్త, గరిక, ఉత్తరేణి, మామిడి ఆకు, విష్ణుక్రాంత పత్రం, దేవదారు, వావిలి ఆకు, దేవకాంచనం, వాకుడాకు, అర్జున పత్రం ఇలా 21 రకాల పత్రాలను వినాయకుడికి సమర్పిస్తారు. నవరాత్రుల్లో 21 పత్రాలను ఇంట్లో ఉంచుకోవడం ద్వారా వాటి నుంచి వెలువడే ప్రాణవాయువు ఆరోగ్యాన్ని చేకూర్చుతుంది. అలాగే వీటిని నీటిలో వేస్తే శుద్ధి అవుతుంది.
పీవోపీతో ప్రాణహాని..
విగ్రహాల తయారీకి ఉపయోగించే పీవోపీతో జలాచరాలు, ప్రజలకు ప్రాణహాని పొంచి ఉన్నది. ఈ రసాయనం దీర్ఘకాలికంగా ప్రకృతిపై ప్రభావం చూపనున్నది. ఫలితంగా పర్యావరణం తీవ్రంగా నష్టపోయి మనుగడ దెబ్బతింటున్నది. కాల్షియం సల్ఫేట్ (జిప్సం)ను వేడి చేస్తే వచ్చే పదార్థమే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇది ప్రవాహక నీటిలో కరగడానికి దాదాపు 3-4 ఏండ్ల సమయం పడుతుంది. కుంటలు, చెరువుల్లో కరగకుండా అలాగే ఉండిపోతుంది. అలాగే పీవోపీ విగ్రహాల్లో పాదరసం, ఆర్గానిక్ కార్బిక్, కోబాల్ట్ ఆక్సైడ్, ఫెర్రన్ ఆక్సైడ్, ప్రోలియం ఆక్సైడ్ వంటి ప్రమాదకర పదార్థాలు ఉంటాయి. వీటిని వినియోగించి తయారుచేసిన విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడంతో పలు ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నది.
మట్టి వినాయకులనే పూజిద్దాం..
వినాయకుడి విగ్రహం ఏ పరిమాణంలో ఉన్నదనేది ముఖ్యం కాదు.. పీవోపీతో తయారు చేసినా. మట్టితో తయారుచేసినా వినాయకుడే కదా. మట్టి విగ్రహాలను పూజించడం ద్వారా పర్యావరణాన్ని కాపాడినవారమవుతాం. పర్యావరణాన్ని కాపాడే బాధ్యత మనందరిది. ఆ దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. పీవోపీ విగ్రహాలను కాకుండా మట్టి వినాయకులనే ప్రతిష్ఠించేందుకు అందరూ ప్రతిజ్ఞ పూనాల్సిన అవసరం ఉన్నది. అలాగే మండపాల్లో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించేలా నిర్వాహకులు చర్యలు తీసుకోవాలి. పర్యావరణ రహిత మండపాల నిర్వహణకు యువత నడుం బిగించాలి.
ఘనంగా ఏర్పాట్లు..
అన్ని పండుగలకు వినాయకచవితికి స్పష్టమైన వ్యత్యాసం ఉంటుంది. ఎవరి శక్తి కొలది వారు దేవుడిని కొలుస్తారు. పిల్లల చదువు, ఇష్ట కార్యసిద్ధి, జ్ఞానం కోసం, విఘ్నాలు తొలగాలని ఇలా తొమ్మిది రోజులపాటు మండపాల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక పూజలు, భజనలు చేస్తారు. మండపాలను అందమైన సెట్టింగ్లతో, విద్యుద్దీపాలతో అలంకరించారు. ప్రతిష్ఠించిన విగ్రహాలకు 3, 5, 9, 11 రోజులు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పూజలు చేస్తారు.
విద్యుత్ ప్రమాదాలపై అప్రమత్తంగా ఉండాలి
నాణ్యత వస్తువులే వాడాలి
మహబూబ్నగర్, ఆగస్టు 30 : వినాయక చవితి ఉ త్సవాల్లో భక్తులు లీనమై చిన్న చిన్న పొరపాట్లు చేయ డం ద్వారా అక్కడక్కడ విద్యుత్ ప్రమాదాల జరిగే అవకాశాలు ఉన్నాయి. మండపాల్లో ఏర్పాటు చేయనున్న విద్యుద్దీపాలు, సౌండ్బాక్స్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి.
తీసుకోవాల్సిన జాగ్రత్తలు..