అయిజ, మార్చి 24 : నడిగడ్డ రాజకీయ రం గంలో అలుపెరగని నేతగా పేరున్న టీఆర్ఎస్ సీనియర్ రాష్ట్ర నేత ఉత్తనూర్ పులకుర్తి తిరుమల్రెడ్డి. ఆయన మృతి అయిజ మండలంతో పాటు జోగుళాంబ గద్వాల జిల్లాలో టీఆర్ఎస్ పార్టీతో పాటు పలువురు నేతలకు, కార్యకర్తలకు తీరనిలోటు మిగిల్చింది. అనారోగ్యంతో బాధపడుతున్నా కూ డా ఆయన రాజకీయాలకు మాత్రం దూరంకాలే దు. అంతటి ప్రజాదరణ పొందిన తిరుమల్రెడ్డి మృతి గ్రామస్తులు, గద్వాల, అలంపూర్ నియోజవర్గ ప్రజలకు తీరని శోకాన్ని మిగిల్చింది. గురువారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన తిరుమల్రెడ్డి అంతిమయాత్రకు ప్రజలు వేలాది గా తరలివచ్చి నివాళులర్పించారు. హైవే -44 పై ఉన్న ఎర్రవల్లి చౌరస్తా నుంచి మొదలైన యాత్ర అయిజ మండలం ఉత్తనూర్ చేరే వరకు ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమాను లు, ప్రజలు వెన్నంటే నడిచారు. ప్రత్యేక వాహనంలో తిరుమల్రెడ్డి భౌతికకాయాన్ని జనవాహి ని మధ్య ఉత్తరూరులోని ఎన్టీఆర్ స్టేడియం వరకు సాగింది. అడుగడుగునా పూలవర్షం కురిపిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తూ పలువురు అభిమానాన్ని చాటుకున్నారు. ఆయన లేడన్న విషయం తెలుసుకొని శోకసంద్రంలో మునిగిపోయారు. శుక్రవా రం ఉదయం 11 గంటల వరకు సందర్శనార్థం భౌతికకాయాన్ని ఉంచనున్నారు. అనంతరం అం త్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యు లు తెలిపారు.
తిరుమల్రెడ్డి అంతిమయాత్రలో ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్రెడ్డి, అబ్రహం, లక్ష్మారెడ్డి, జె డ్పీ చైర్సర్సన్ సరితతోపాటు పంచాయతీ ట్రిబ్యునల్ మాజీ చైర్మన్ బండారి భాస్కర్, టీఆర్ఎస్ యువజన నేత అజయ్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ విష్ణువర్ధన్రెడ్డి, ఆర్డీఎస్ ప్రాజెక్టు మాజీ చైర్మన్ తనగల సీతారాంరెడ్డి, ఎంపీపీ మాజీ సీతారాంరెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మున్సిపల్ చై ర్మన్లు, విండో చైర్మన్లు, వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.
గద్వాల, మార్చి 24 : తిరుమల్రెడ్డి పార్థివ దే హానికి జమ్మిచేడ్ గ్రామం వద్ద ఎమ్మెల్యే కృష్ణమోహన్రెడ్డి, ఆయన సతీమణి బండ్ల జ్యోతి స్వాగ తం పలికి నివాళులర్పించారు. అనంతరం జమ్మిచేడ్ నుంచి అయిజ వరకు అంతిమయాత్ర నిర్వహించారు. ర్యాలీలో మున్సిపల్ చైర్మన్ కేశవ్, మా ర్కెట్ కమిటీ చైర్పర్సన్ రామేశ్వరి, ఎంపీపీ విజయ్కుమార్, కౌన్సిలర్ నాగిరెడ్డి పాల్గొన్నారు.