పెట్రోల్, డీజిల్పై లీటరుకు 35 పైసలు పెంపు
న్యూఢిల్లీ: ఇంధన ధరలు వరుసగా నాలుగో రోజూ పెరిగాయి. శనివారం లీటరు పెట్రోల్పై 35 పైసలు, లీటరు డీజిల్పై 35 పైసలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు పెంచాయి. దీంత ఇంధన ధరలు దేశవ్యాప్తంగా రికార్డుస్థాయికి చేరాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.113.71కి చేరగా.. డీజిల్ ధర రూ.106.95కి చేరింది. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.108.99కి పెరుగగా.. డీజిల్ ధర రూ.97.72కి చేరింది. ముంబైలో లీటరు పెట్రోల్ ధర రూ.114.81కి ఎగబాకగా.. డీజిల్ ధర రూ.105.86కి పెరిగింది.