రూ. 27 కోట్ల నిధులతో అభివృద్ధి
మేడ్చల్, మార్చి 26 : ఫాక్స్సాగర్ను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని ఫాక్స్సాగర్ను ప్రభుత్వం రూ. 27 కోట్ల నిధులతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతున్నది. 482 ఎకరాల విస్తీర్ణం ఉన్న ఫాక్స్సాగర్(చెరువు)లోకి మురికినీరు చేరకుండా పైపులైన్ నిర్మాణ పనులు, చెరువు కట్ట సుందరీకరణతో పాటు పార్క్లను ఏర్పాటు చేయనున్నారు. వెన్నలగడ్డ చెరువు వరకు 3 కి.మీ. నిర్మిస్తున్న పైపులైన్ల పనులు పూర్తయిన వెంటనే నీటి శుద్ధి యంత్రాల ద్వారా మురికి నీటిని శుద్ధి చేసి చెరువులోకి వదిలే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఫాక్స్సాగర్ పర్యాటక కేంద్రాంగా మారితే నిత్యం సందర్శకులతో కిట కిట లాడనుంది. ఈ నేపథ్యంలోనే ఫాక్స్సాగర్కు వెళ్లేందుకు రోడ్ల నిర్మాణాలను చేపట్టినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.