జవహర్నగర్, మే 26: గుడ్ వే ఫౌండేషన్ ఆశ్రమంలో(Goodway Foundation) నలుగురు యువకులు అదృశ్యమయ్యారు (Disappeared). ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధి దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. ఎస్హెచ్వో నాగరాజు తెలిపిన వివరాల ప్రకారం..దమ్మాయిగూడలోని(Dammaiguda) ఎల్ఎన్ఆర్కాలనీలో బోడ విజయ్కుమార్ గుడ్ వే ఫౌండేషన్ను నిర్వహిస్తున్నారు. గత 3 సంవత్సరాల నుంచి ఆశ్రమం నడిపిస్తూ మద్యం, డ్రగ్స్కు బానిసైన యువకులకు చికిత్సను అందిస్తున్నారు.
నగరంలోని వివిధ ప్రాంతాలకు చెందిన యువకులు 15 రోజుల క్రితం మహ్మద్ అలీ(21), సయ్యద్ ఖలీల్(35), 45 రోజుల క్రితం అబుబాకర్(21), 3 నెలల క్రితం అబ్రార్ అలీ(26) ఆశ్రమంలో చేరారు. ప్రతి రోజు వీరికి మద్యపానానికి దూరంగా ఉండాలని అవగాహన కల్పిస్తూ, చైతన్యం చేస్తున్నారు. ఈ నెల 24 ఆశ్రమంలో ఎవరికి చెప్పకుండా కిచెన్ నుంచి బయటకు వెళ్లిపోయి ఇంత వరకు రాలేదు. దీంతో వారి ఆచూకీ కోసం చుట్టుపక్కల, బంధువుల వద్ద వెతికినా సమాచారం లభించలేదు. ఈ మేరకు ఆశ్రమ నిర్వాహకుడు విజయ్కుమార్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.