శ్రీనగర్: జమ్ముకశ్మీర్లో సోమవారం తెల్లవారుఝామున జరిగిన ఎన్కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులను మట్టుబెట్టాయి భద్రతా బలగాలు. దక్షిణ కశ్మీర్లోని మణిహల్ ప్రాంతంలో ఈ ఎన్కౌంటర్ జరిగింది. చనిపోయిన ఉగ్రవాదులందరూ లష్కరే తోయిబాకు చెందిన వాళ్లుగా గుర్తించారు. ఉగ్రవాదులు ఆ ప్రాంతంలో ఉన్నారన్న సమాచారంతో ఆదివారం రాత్రి నుంచి భద్రతా బలగాలు కార్డన్ సెర్చ్ నిర్వహించాయి. ఆ సమయంలో వాళ్లకు ఎదురుపడిన ఉగ్రవాదులు కాల్పులు ప్రారంభించారు. దీంతో బలగాలు ఎదురు కాల్పులు జరపడంతో నలుగురు ఉగ్రవాదులు మరణించారు.