హైదరాబాద్ : వికారాబాద్, సిద్దిపేట జిల్లాల్లో సోమవారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్ మండలం ఈర్లపల్లి వద్ద ద్విచక్ర వాహనాన్ని డీసీఎం వ్యాన్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఫకీరప్ప (దౌల్తాబాద్) అనే వ్యక్తితో పాటు చిన్నవార్లకు చెందిన మరో వ్యక్తి అక్కడికక్కడే మృత్యువాతపడ్డారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం లకుడారం వద్ద ద్విచక్ర వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఇద్దరు మృత్యువాతపడగా.. ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఆయా సంఘటనలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.