గుంటూరు : ఏపీలోని గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు డొక్కా మాణిక్య వరప్రసాద్ (Dokka Varaprasad) వైసీపీకి రాజీనామా చేశారు. జిల్లా అధ్యక్ష పదవికి, క్రియశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తూ లేఖను వైసీపీ అధ్యక్షుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) కు పంపారు.
గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న మాణిక్య వరప్రసాద్ టీడీపీ ఎమ్మెల్సీగా పనిచేసి 2022లో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి పార్టీకి సేవలందిస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికల్లో పార్టీ అధిష్టానం తగిన గుర్తింపు ఇవ్వడం లేదని కొన్ని రోజులుగా పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. తాజాగా శుక్రవారం పార్టీకి రాజీనామా సమర్పించారు. తిరిగా ఆయన టీడీపీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం.