హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): బీటెక్ కోర్సుల్లో ల్యాట్రల్ ఎంట్రీ కోసం నిర్వహించిన టీఎస్ఈసెట్ ఫలితాలు ఈ నెల 20 లేదా 21న విడుదల చేయనున్నారు. ఈసెట్ పరీక్షను ఏపీ, తెలంగాణ రాష్ర్టాల్లో సోమవారం పరీక్షను సజావుగా నిర్వహించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ పీ చంద్రశేఖర్ వెల్లడించారు.
ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 99 పరీక్షాకేంద్రాల్లో ఆన్లైన్లో ఈ పరీక్షను నిర్వహించగా, 96.12శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్టు పేర్కొన్నారు. 24,272 మంది విద్యార్థులకుగానూ 23,330 మంది పరీక్ష రాశారని తెలిపారు.