న్యూఢిల్లీ, మార్చి 27: ఇంధన ధరలు మళ్లీ పెరిగాయి. ఆదివారం లీటరు పెట్రోల్పై 57 పైసలు, డీజిల్పై 59 పైసలు పెరిగింది. పెట్రోల్ ధరలు పెరగడం గడిచిన ఆరు రోజుల్లో ఇది ఐదో సారి. ఆరు రోజుల్లో మొత్తంగా పెట్రోల్పై రూ.4.17, డీజిల్పై రూ.4.07 చొప్పున రేట్లు పెరిగాయి. రాష్ర్టాల్లో పన్నుల్లో మార్పులను బట్టి ఈ రేట్లలో మార్పులుంటాయి. హైదరాబాద్లో పెట్రోల్ రేటు 57 పైసలు పెరిగి లీటర్ ధర రూ.112.37కు చేరింది. డీజిల్ ధర 59 పైసలు పెరిగి లీటర్కు రూ.98.69 అయింది. పెట్రోల్ రేట్ల పెరుగుదలకు నిరసనగా మహారాష్ట్రలో శివసేన కార్యకర్తలు ప్రదర్శనలు నిర్వహించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారుపై విమర్శలు గుప్పించారు. ‘2014లో రూ.400 ఉన్న సిలిండర్ ధర ఇప్పుడు రూ.1,050కి పెరిగింది. పెట్రోల్ రేట్లు మండిపోతున్నాయి. ధరల నియంత్రణ బాధ్యత నుంచి కేంద్రం తప్పించుకొంటున్నది’ అని ఎమ్మెల్సీ అంబాదాస్ దన్వే ఆరోపించారు.
హైదరాబాద్లో శనివారం ధర పెంపు(పైసల్లో) తాజా ధర
పెట్రోల్ రూ.111.80 57 రూ.112.37
డీజిల్ రూ.98.10 59 రూ.98.69